మళ్ళీ తెరపైకి మర్యాద రామన్న కాంబినేషన్!

మళ్ళీ తెరపైకి మర్యాద రామన్న కాంబినేషన్!
x
Highlights

ఇప్పుడు సునీల్, సలోని ప్రధాన పాత్రలలో ఓ సినిమాని ప్లాన్ చేశారట దర్శకుడు విఎన్ ఆదిత్య. ఈ సినిమాని ఓటీటీ వేదికగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట

కమెడియన్ సునీల్ హీరోగా, సక్సెస్ఫుల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం మర్యాద రామన్న. ఇందులో సునీల్ సరసన సలోని హీరోయిన్ గా నటించింది. 2010లో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అయితే దాదాపుగా పదేళ్ళ తర్వాత ఇప్పుడు సునీల్, సలోని కంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తోంది.

ఇటివల సునీల్ విలన్ గా వచ్చిన కలర్ ఫోటో చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమాకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అయితే ఇప్పుడు సునీల్, సలోని ప్రధాన పాత్రలలో ఓ సినిమాని ప్లాన్ చేశారట దర్శకుడు విఎన్ ఆదిత్య. ఈ సినిమాని ఓటీటీ వేదికగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలో వెలువడనుంది.

మర్యాద రామన్న కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుండడం, విఎన్ ఆదిత్య చాలా గ్యాప్ తీసుకొని సినిమా చేస్తుండడంతో సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి. అటు ఈ మధ్య హీరోగా సునీల్ చేసిన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతుండడంతో మళ్ళీ కమెడియన్ గానే సినిమాలు చేస్తున్నాడు సునీల్.

Show Full Article
Print Article
Next Story
More Stories