'మన్మధుడు' సీక్వెల్ కి ఇంత బడ్జెట్టా

మన్మధుడు సీక్వెల్ కి ఇంత బడ్జెట్టా
x
Highlights

'మన్మధుడు' సినిమా సూపర్ హిట్ అయిన 18 సంవత్సరాల తరువాత ఈ సినిమాకి సీక్వెల్ ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని లాంచ్ కూడా చేశారు. మనం ఎంటర్...

'మన్మధుడు' సినిమా సూపర్ హిట్ అయిన 18 సంవత్సరాల తరువాత ఈ సినిమాకి సీక్వెల్ ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని లాంచ్ కూడా చేశారు. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ (జెమిని కిరణ్) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ప్రారంభోత్సవంలో అమల, నాగచైతన్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అమల అక్కినేని క్లాప్ కొట్టగా, అక్కినేని నాగచైతన్య కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ యూరప్ లో ప్రారంభించనున్నారు. తాజాగా 'మన్మధుడు 2' బడ్జెట్ పై ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

'దేవదాసు' తర్వాత నాగ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మంచి స్క్రిప్టు రెడీ చేయించుకుని మరీ నటిస్తున్నారు. సినిమా క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా 20-25 కోట్ల మధ్య బడ్జెట్ పెడుతున్నారని తెలుస్తోంది. 'చి.ల.సౌ' లాంటి చిన్న బడ్జెట్ సినిమా తో దర్శకుడిగా మెప్పించిన రాహుల్ రవీంద్రన్ పెద్ద బడ్జెట్ కి దర్శకత్వం వహించడం ఇదే మొదటిసారి. మరి 'మన్మధుడు' తరహాలో క్లాసిక్ హిట్ ఇస్తాడా లేదా వేచి చూడాలి. రకుల్ ప్రీత్ సింగ్, పాయల్ రాజపుత్ ఈ సినిమాలో హీరోయిన్లు గా నటిస్తున్నారు. 'ఆర్ ఎక్స్ 100' ఫేమ్ చింతన్ భరద్వాజ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories