ఫామ్ లో లేని దర్శకుడు వెయ్యి కోట్ల బడ్జెట్ తో సినిమా తీయగలడా

ఫామ్ లో లేని దర్శకుడు వెయ్యి కోట్ల బడ్జెట్ తో సినిమా తీయగలడా
x
Highlights

సౌత్ ఇండస్ట్రీలో పాప్యులర్ దర్శకులలో మణిరత్నం కూడా ఒకరు. ఇప్పటికే బోలెడు బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన మణిరత్నం గత కొంతకాలంగా మాత్రం వరుస...

సౌత్ ఇండస్ట్రీలో పాప్యులర్ దర్శకులలో మణిరత్నం కూడా ఒకరు. ఇప్పటికే బోలెడు బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన మణిరత్నం గత కొంతకాలంగా మాత్రం వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్నారు. తాజాగా మణిరత్నం దర్శకత్వం వహించిన 'చెక్క చివంత వానం (తెలుగులో నవాబ్)' మల్టీస్టారర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఏమాత్రం మెప్పించలేకపోయింది. ఈ సినిమా తరువాత మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్' అనే మరొక సినిమాతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇది కూడా ఒక చారిత్రాత్మక భారీ బడ్జెట్ మల్టీ స్టారర్

విక్రం, జయం రవి, కార్తి, అమితాబ్ బచ్చన్, మోహన్ బాబు, ఐశ్వర్య రాయ్, కీర్తి సురేష్ వంటి స్టార్ కాస్ట్ తో ఈ సినిమ తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాని ఏకంగా వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలని మణిరత్నం ప్లాన్ చేస్తున్నారట. కానీ ప్రస్తుతం మణిరత్నం మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని ఏ నిర్మాత అన్నేసి కోట్లు వెచ్చించడానికి సిద్ధమవుతాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పైగా రాజమౌళి లాగా మణిరత్నానికి దేశవ్యాప్తంగా మార్కెట్ కూడా అంత ఎక్కువగా లేదు. ఈ నేపథ్యంలో అసలు ఈ సినిమా కార్యరూపం దాలుస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories