మంచు విష్ణు గుడ్ న్యూస్.. 'ఢీ' సినిమాకి సీక్వెల్!

మంచు విష్ణు గుడ్ న్యూస్..  ఢీ సినిమాకి సీక్వెల్!
x
Highlights

ఈ సినిమాకి సీక్వెల్ ఎప్పుడుంటుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే అలాంటి అభిమానులకి శుభవార్త చెప్పారు మంచు విష్ణు. ఈ రోజు మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా 'ఢీ' సినిమాకి సీక్వెల్ చేయబోతున్నట్టుగా ప్రకటించారు విష్ణు.

Manchu Vishnu Birthday Special : కలక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు మంచు విష్ణు. మొదటగా వరుస ప్లాప్స్ వచ్చినప్పటికీ 'ఢీ' సినిమాతో మంచి హిట్ కొట్టాడు విష్ణు. శ్రీను వైట్ల దర్శకత్వంలో 2007లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో విష్ణు సరసన జెనిలియా హీరోయిన్ గా నటించింది. శ్రీహరి, బ్రహ్మానందం, సునీల్, చంద్రమోహన్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

అయితే ఈ సినిమాకి సీక్వెల్ ఎప్పుడుంటుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే అలాంటి అభిమానులకి శుభవార్త చెప్పారు మంచు విష్ణు. ఈ రోజు మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా 'ఢీ' సినిమాకి సీక్వెల్ చేయబోతున్నట్టుగా ప్రకటించారు విష్ణు. ఈ సినిమాకి "డి & డి డబుల్ డోస్" అంటూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేశారు. టైటిల్ చూస్తుంటేనే సినిమాలో డబల్ ఫన్ ఉంటుందన్న విషయం అర్ధమైపోతుంది.

ఇక ఈ సినిమాను మంచు విష్ణునే స్వయంగా నిర్మిస్తుండగా, భీష్మతో బాగా పాపులర్ అయిన మహతి స్వర భాస్కర్ (మణిశర్మ తనయుడు) ఈ సినిమాకి సంగీతం అంధించనున్నాడు. అయితే ఈ సినిమాలో నటినటులు ఎవరు అన్నదానిపైన త్వరలో క్లారిటీ రానుంది. ముఖ్యంగా 'ఢీ' సినిమాలో మెయిన్ లీడ్స్ లో నటించిన శ్రీహరి, జయప్రకాశ్ రెడ్డి ప్రస్తుతం లేరు కాబట్టి వారి పాత్రలో ఎవరిని తీసుకోబోతున్నారనేదాని పైన ఆసక్తి నెలకొంది.

ఇక గత కొద్ది రోజులుగా హిట్స్ లేకా సతమతం అవుతున్నమంచు విష్ణు, శ్రీను వైట్ల ఓ సక్సెస్ఫుల్ సినిమాకి సీక్వెల్ చేయబోతుండడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ పైకి తీసుకెళ్ళి సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారని సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories