ప్రభాస్ సినిమా పై క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ నటుడు

ప్రభాస్ సినిమా పై క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ నటుడు
x
Highlights

'బాహుబలి' సినిమాతో ప్యాన్ ఇండియన్ గా మారిపోయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ హీరోగా సుజిత్...

'బాహుబలి' సినిమాతో ప్యాన్ ఇండియన్ గా మారిపోయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. కోలీవుడ్ నటుడు అరుణ్ విజయ్ కూడా కీలక పాత్ర పోషించారు. గత కొంత కాలంగా ఈ సినిమాలో కేవలం మూడు పాటలు మరియు ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని మిగతాదంతా ప్యాచ్ వర్క్ మాత్రమే అని వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమా ఆగస్టు 15న విడుదల అవుతుందా లేదా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో అన్ని రూమర్లకు చెక్ పెడుతూ అరుణ్ విజయ్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ట్విట్టర్ ద్వారా అరుణ్ విజయ ఒక పెద్ద పోస్ట్ ను షేర్ చేశారు. 'నా పాత్ర షూటింగ్ పూర్తయింది. ఇలాంటి హార్డ్ వర్కింగ్ టీం తో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రభాస్ కు, సుజిత్ కి, యు.వి.క్రియేషన్స్ మరియు చిత్ర బృందానికి నా కృతజ్ఞతలు. ఈ జర్నీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆగస్టు 15న ఒక అద్భుతమైన అనుభవం కోసం ఎదురు చూడండి. సీ యూ ఆల్" అని ట్వీట్ చేసి అరుణ్ విజయ్ ఈ సినిమా ఆగస్టు 15న విడుదల అవడం ఖాయం అని చెప్పకనే చెప్పేసాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories