మహేష్ బాబుకు పదేళ్ల తరువాత త్రివిక్రమ్ గుర్తొచ్చారు !

మహేష్ బాబుకు పదేళ్ల తరువాత త్రివిక్రమ్ గుర్తొచ్చారు !
x
Highlights

ఒక డైరెక్టర్‌ హిట్‌ సినిమా తీస్తే చాలు ఆ డైరెక్టర్‌ దగ్గర కర్చీప్‌ వేస్తుంటారు స్టార్‌ హీరోలు. వారు కొత్త వారా పాత వారా అనేది చూడరు. అయితే వీళ్లలో...

ఒక డైరెక్టర్‌ హిట్‌ సినిమా తీస్తే చాలు ఆ డైరెక్టర్‌ దగ్గర కర్చీప్‌ వేస్తుంటారు స్టార్‌ హీరోలు. వారు కొత్త వారా పాత వారా అనేది చూడరు. అయితే వీళ్లలో సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ముందుంటారు. ఏ డైరెక్టర్‌ అయిన హిట్‌ కొడితే మంచి కథ ఉంటే చెప్పండీ చేసేద్దాం అంటుంటారు. ఇది వరకు ఎడ మొహం పెడ మొహంగా ఉన్న త్రివిక్రమ్‌తో జత కట్టడానికి ట్రై చేస్తున్నాడు.

సంక్రాంతికి భారీ ప్లాన్‌తో అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చారు త్రివిక్రమ్‌ శ్రీనివాస్. గతేడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరుతో మహేష్‌ వచ్చిన అలా వైకుంఠపురములో మూవీ ముందు నిలవలేకపోయింది. 2020లో వచ్చిన సినిమాల్లో అలా వైకుంఠపురములో మూవీనే టాప్‌హిట్‌ సినిమా.

త్రివిక్రమ్‌ మహేష్‌ కాంబినేషన్‌లో అతడు, ఖలేజా రెండు సినిమాలు వచ్చాయి. అతడు మంచి హిట్‌ అయిన ఖలేజా మాత్రం ప్లాప్‌ అయ్యింది. దీంతో త్రివిక్రమ్‌ను దూరం పెట్టాడు మహేష్. కేవలం త్రివిక్రమ్‌నే కాదు పూరీ జగన్నాథ్, సుకుమార్‌ లాంటి వాళ్లను కూడా పక్కన పెట్టాడు. ఇప్పుడు త్రివిక్రమ్‌ మంచి ఫామ్‌లోకి రావడంతో, మహేష్‌ మళ్లీ త్రివిక్రమ్‌ వెంటపడుతున్నారు.

ఖలేజా రిలీజ్‌ అయి పది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా త్రివిక్రమ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్లీ మనం త్వరలోనే కలిసి పని చేద్దామంటూ ఇన్‌ డైరెక్టర్‌గా త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి సిద్ధమంటూ హింట్‌ ఇస్తున్నాడు. సెక్సెస్‌లు ఉంటే ఖర్చీఫ్‌ వేయటం ఫ్లాప్‌ అయితే వదిలేయడం మహేష్‌కు అలవాటనే కామెంట్స్‌ టాలీవుడ్‌లో విన్పిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories