మొదలైన మహేష్ బాబు 'సర్కారు వారి పాట'!

మొదలైన మహేష్ బాబు సర్కారు వారి పాట!
x
Highlights

KPHB కాలనీలోని కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ లో 11: 43కి పూజా కార్యక్రమాలతో మొదలైంది. మహేష్ బాబు కూతురు ఘట్టమనేని సీతార క్లాప్ కొట్టగా, నమ్రత మహేష్ కెమరా స్విచ్ ఆన్ చేశారు.

ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ హిట్ కొట్టిన మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని యువ దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ రోజు లాంఛనంగా స్టార్ట్ అయింది. KPHB కాలనీలోని కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ లో 11: 43కి పూజా కార్యక్రమాలతో మొదలైంది. మహేష్ బాబు కూతురు ఘట్టమనేని సీతార క్లాప్ కొట్టగా, నమ్రత మహేష్ కెమరా స్విచ్ ఆన్ చేశారు. జనవరి మొదటివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అటు ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మైత్రి మూవీ మేకర్స్, ఎంబీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నాడు. మే లో సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇది మహేష్ బాబు కూడా 27 వ సినిమా కావడం విశేషం. మధి సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

వాస్తవానికి మహేష్ బాబు తన 27వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయాల్సి ఉంది. కథ అసంపూర్తిగా ఉండడం, మహేష్ చిన్న చిన్న మార్పులు చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ ని మహేష్ పక్కన పెట్టారని సమాచారం.. దీనితో లైన్ లోకి పరుశురాం సినిమా వచ్చింది. ఈ సినిమా తర్వాత మహేష్ వంశీతో చేస్తారా లేదా అన్నది చూడాలి మరి!


Show Full Article
Print Article
Next Story
More Stories