భార్య నమ్రతా పుట్టినరోజు సోషల్ మీడియాలో మహేశ్ స్పెషల్ విషెస్

భార్య నమ్రతా పుట్టినరోజు సోషల్ మీడియాలో మహేశ్ స్పెషల్ విషెస్
x
Mahesh Babu
Highlights

టాలీవుడ్ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ ‎పుట్టినరోజు కావడంతో ఆమె తన పుట్టినరోజు యూఎస్‌లోని న్యూయార్క్‌లో జరుపుకుంటున్నారు. ‎

టాలీవుడ్ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ ‎పుట్టినరోజు కావడంతో ఆమె తన పుట్టినరోజు యూఎస్‌లోని న్యూయార్క్‌లో జరుపుకుంటున్నారు. ‎బుధవారం ఆమె 48వ ఏట అడుగుపెట్టారు. నమ్రతా శిరోద్కర్ భర్త మహేష్ బాబు, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి న్యూయార్క్‌లో జరుపుకుంటున్నారు . నమ్రతా పుట్టినరోజు పురష్కరించుకొని మహేష్ బాబు సోషల్ మీడియా విషెస్ తెలిపారు. దీంతో మహేష్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ తెగ ఆటక్టుకుంటుంది.

మహేష్ పోస్ట్ చేసి క్యాప్షన్ కూడా ఇచ్చారు. నీ కలలు నిజమవ్వాలని కోరుకుంటున్నా.., నా జీవిత భాగస్వామికి పుట్టిన రోజు శుభాకాంక్షలు .. నాపై ప్రేమ మాత్రమే ఉంది. చెప్పలేనంత ప్రేమ ఉంది. లవ్ యూ సోమచ్ .. అంటూ మహేష్ నమత్రతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు.

మహేశ్‌, నమ్రత 5ఏళ్ల పాటు ప్రేమించుకుని 2005లో వివాహం చేసుకున్నారు. 'వంశీ' సినిమాలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. మహేష్‌తో వివాహం చేసుకున్న తర్వాత నమ్రతా పూర్తిగా సినిమాలకు దూరమైయ్యారు. మహేష్ బాబుకు సంబంధించిన అన్ని విషయాల్లో యాడ్స్‌, సినిమాలు, వ్యక్తిగత జీవితంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. మహేష్ బాబు నటించిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' సంక్రాంతి సందర్భంగా జనవరి 11న విడుదలైన భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారు సినిమా సక్సెస్ ఎంజాయ్‌ చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories