ఛలో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన మహేష్

ఛలో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన మహేష్
x
Highlights

ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన మహేష్ బాబు ప్రస్తుతం గీతా గోవిందం ఫేం పరుశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది.

ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన మహేష్ బాబు ప్రస్తుతం గీతా గోవిందం ఫేం పరుశురామ్‌ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది. ఇందులో మహేష్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

వెంకీ కుడుముల దర్శకత్వంలో ఇటీవల నితిన్‌, రష్మిక మందన కాంబినేషన్‌లో వచ్చిన భీష్మ సూపర్‌ హిట్‌ విజయాన్ని సొంతం చేసుకున్నసంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం వెంకీ కుడుముల ఇటీవల ఓ సరికొత్త కథతో హీరో రామ్‌ చరణ్‌ను కలిసినట్లు సమాచారం. అయితే ఈ కథకి పెద్దగా రామ్ చరణ్ ఇంప్రెస్ కాకపోవడంతో నో చెప్పాడట. దీంతో వెంటనే వెంకీ మహేష్‌ బాబు వద్దకు వెళ్లి ఇదే కథ వినిపించగా ఈ సినిమాలో నటించేందుకు మహేష్ ఆసక్తి చూపించినట్టుగా సమాచారం.

అన్నీ కుదిరితే త్వరలోనే మహేష్, వెంకీ కాంబినేషన్ లో ఓ సినిమా చూసే అవకాశం ఉందనే చెప్పాలి. త్వరలోనే దీనిపైన అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం రామ్‌ చరణ్‌ టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం,రణం, రుధిరం) అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి దర్వకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు చరణ్.

Show Full Article
Print Article
Next Story
More Stories