తన స్టాట్యూ చూసిన మహేష్ రియాక్షన్ ఇదే

తన స్టాట్యూ చూసిన మహేష్ రియాక్షన్ ఇదే
x
Highlights

ఏఎంబీ మాల్ లో సూపర్ స్టార్ మహేష్ విగ్రహా ఆవిష్కరణ జరిగిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి....

ఏఎంబీ మాల్ లో సూపర్ స్టార్ మహేష్ విగ్రహా ఆవిష్కరణ జరిగిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నిజానికి సింగపూర్ టుస్సాడ్స్ లోనే విగ్రహాన్ని ఆవిష్కరించాలని అనుకున్నారు కానీ కాల్షీట్ల సమస్య వల్ల హైదరాబాద్ లోనే విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, "ఆరేళ్ల క్రితం నేను నా కుటుంబంతో లండన్ లోని మ్యాడమ్ టుస్సాడ్స్ ని సందర్శించినప్పుడు అక్కడ విగ్రహాలని చూసి నా పిల్లలు సితార, గౌతమ్ చాలా ఎగ్జయిట్ అయ్యారు. ఏదో ఒక రోజు నా విగ్రహం ఇక్కడ ఆవిష్కరించాలని అప్పుడే అనుకున్నాను అది ఇప్పటికి నిజమైంది" అని చెప్పుకొచ్చాడు మహేష్ బాబు.

"సినీ ప్రియుల మధ్య నా విగ్రహాన్ని ఇలా విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. వారు నా విగ్రహాన్ని మలిచిన తీరు వండర్ ఫుల్ గా ఉంది. నన్ను నేను చూసుకుంటున్నట్టుగా అనిపిస్తోంది. నా విగ్రహానికి నిజంగా ప్రాణం పోశారు. ఇవాన్ రీజ్ బెంటానా & టీమ్ కి నా కృతజ్ఞతలు" అని అన్నారు. మ్యాడమ్ టుస్సాడ్స్ నిర్వాహకులు మాట్లాడుతూ, "మొదటి సారి ఇలా సింగపూర్ లో కాకుండా వేరొక చోట స్టాట్యూ ని విడుదల చేస్తున్నాం. మొదటి సారిగా హైదరాబాద్ కు వచ్చాం. మహేష్ ని ఎంతో మంది అభిమానులు కోరిక మేరకు ఎంపిక చేసుకున్నాం." అని అన్నారు. ప్రభాస్ తరువాత మ్యాడమ్ టుస్సాడ్స్ లో స్టాట్యూ పొందిన రెండవ హీరో మహేషే.

Show Full Article
Print Article
Next Story
More Stories