థియేటర్ కు విచ్చేయబోతున్న మహేష్ బాబు

థియేటర్ కు విచ్చేయబోతున్న మహేష్ బాబు
x
Highlights

'భరత్ అనే నేను' సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ బాబు ఇప్పుడు 'మహర్షి' సినిమాతో మరొక సూపర్ హిట్ ను నమోదు చేసుకోవడంతో మహేష్ బాబుతో పాటు తన...

'భరత్ అనే నేను' సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ బాబు ఇప్పుడు 'మహర్షి' సినిమాతో మరొక సూపర్ హిట్ ను నమోదు చేసుకోవడంతో మహేష్ బాబుతో పాటు తన అభిమానులు కూడా సంతోషం లో మునిగి తేలుతున్నారు. ఇప్పటికే సినిమా విడుదల అయినప్పటికీ ప్రమోషన్ లతో బిజీగా ఉన్నారు దర్శక నిర్మాతలు. తాజా సమాచారం ప్రకారం ప్రమోషన్ల నేపథ్యంలో మహేష్ బాబు హైదరాబాద్ ఆర్జీసీ క్రాస్ రోడ్స్‌ ఏరియాలోని సుదర్శన్ 35 ఎం.ఎం థియేటర్ వద్దకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రమోషన్ల పేరుతో థియేటర్ల వద్దకు మహేష్ బాబు వచ్చి చాలా కాలం అయింది కాబట్టి అభిమానులు కూడా మహేష్ బాబు ని చూసేందుకు కచ్చితంగా వస్తారు. ఈ రకంగా కలెక్షన్లు కూడా బాగానే పెరుగుతాయి అని ట్రేడ్ వర్గాలు కూడా విశ్లేషిస్తున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. అల్లరి నరేష్ ముఖ్యపాత్ర పోషించిన ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మించారు. మే 9 న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు నమోదు చేసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories