ఫేస్ బుక్ నుంచి తప్పుకున్న మాధవీలత.. అది తట్టుకోవడం నా వల్ల కాదంటూ పోస్ట్

ఫేస్ బుక్ నుంచి తప్పుకున్న మాధవీలత.. అది తట్టుకోవడం నా వల్ల కాదంటూ పోస్ట్
x

మాధవీలత

Highlights

బీజేపీ యువ నాయకురాలు, ప్రముఖ హీరోయిన్ మాధవీలత సంచలన నిర్ణయం తీసుకున్నారు. పర్సనల్ ఫేస్ బుక్ ఖాతా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆమె...

బీజేపీ యువ నాయకురాలు, ప్రముఖ హీరోయిన్ మాధవీలత సంచలన నిర్ణయం తీసుకున్నారు. పర్సనల్ ఫేస్ బుక్ ఖాతా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు. దాదాపు 5.6 మిలియన్ల మంది మాధవీలత ఆకౌంట్ ను ఫాలో అవుతున్నారు.

ఈ సందర్బంగా 'ప్రియమైన ఫాలోవర్స్‌.. నా ఫేస్ బుక్‌లో నెగిటివిటీకి పూర్తిగా విసుగుచెందాను. దాదాపు 90 శాతం మంది నాపై నెగిటివ్‌గానే స్పందిస్తున్నారు. ఈ సమాజానికి ఫేక్ అండ్ ప్లాస్టిక్ నవ్వులే కావాలి. నేను అలా ఉండలేను. ఈరోజు నుంచి నా ఫేస్ బుక్‌ని నేను హ్యాండిల్ చేయడం లేదు. ఇకపై నా టీం హ్యాండిల్ చేస్తుంది. ఏదైనా ముఖ్యమైన సమాచారం ఉంటే ఇంట్రాక్ట్ అవుతాను. నన్ను అభిమానించే వాళ్లు ప్రేమకు సపోర్ట్‌కి చాలా థాంక్స్. ఇకపై ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రామ్‌లో అందుబాటులో ఉంటా' అంటూ పోస్ట్ పెట్టింది మాధవీలత.

అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుంచి బీజేపీ అభ్యర్థినిగా పోటీ చేసి ఓడిపోయారు. కొంత కాలం యాక్టివ్ పాలిటిక్స్ దూరంగా ఉన్న మాధవీలత..తెలంగాణ పాలిటిక్స్‌పై దృష్టిసారించారు. తరచూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటు వచ్చారు. అయితే మాధవీలత ఎదీ పోస్టు చేసిన నెటిజన్లు వీపరితంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఒక్కోసారి హద్దులు దాటుతున్నాయి కూడా.. దీంతో విసుగు చెందిన ఆమె తన వ్యక్తిగత ఫేస్ బుక్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories