'చిత్రలహరి' సినిమా చూసిన చిరంజీవి ఏమన్నారంటే

చిత్రలహరి సినిమా చూసిన చిరంజీవి ఏమన్నారంటే
x
Highlights

వరుసగా ఆరు డిజాస్టర్ లని చవిచూసిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈ మధ్యనే కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన 'చిత్రాలహరి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు...

వరుసగా ఆరు డిజాస్టర్ లని చవిచూసిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈ మధ్యనే కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన 'చిత్రాలహరి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏప్రిల్ 12న విడుదలైన ఈ సినిమా లో కళ్యాణి ప్రియదర్శన్, నివేదపేతురాజ్ హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాలో తండ్రి కొడుకుల అనుబంధం గురించి చాలా బాగా చూపించారని, యువతకు ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ కూడా ఉందని తెలిపారు చిరంజీవి.

"ఎన్నిసార్లు ఓటమి ఎదురైనా సరే కష్టపడుతూ ముందుకు వెళ్ళగలిగితే ఏదైనా సాధించవచ్చని ఈ సినిమా చెబుతుంది. కిషోర్ తిరుమల ఈ సినిమాను చాలా చక్కగా తీర్చిదిద్దారు. సాయి తేజ్ నటనలో మెచ్యూరిటీ కనిపించింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి అందించిన సంగీతంతో మరొకసారి ఆకట్టుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు మరొక సక్సెస్ ను అందుకున్నారు. 'చిత్రలహరి' టీంకు నా శుభాకాంక్షలు. ఈ సినిమా సమ్మర్ హాలిడేస్ లో కుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కని సినిమా" అని కితాబిచ్చారు చిరు. వర్డ్ ఆఫ్ మౌత్ కూడా బాగానే ఉండటంతో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లను కూడా సేఫ్ జోన్ లో ఉంచుతుందని సమాచారం అందుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories