చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులతో మంత్రి తలసాని భేటీ!

చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులతో మంత్రి తలసాని భేటీ!
x
Highlights

ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులతో కలసి తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ భేటీ అయ్యారు.

ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులతో కలసి తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ భేటీ అయ్యారు. ఇందులో చిరంజీవి, నాగార్జునతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్‌బాబు, సి.కల్యాణ్, దిల్‌రాజు, జెమిని కిరణ్‌, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, దర్శకుడు రాజమౌళి, వి.వి వినాయక్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, ఎన్‌.శంకర్‌, కొరటాల శివ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా సినిమా షూటింగ్ లపై ధియేటర్ల రీ ఓపెన్ పలు అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మంత్రి తలసాని మాట్లాడుతూ.. అందరి అభిప్రాయాలు తీసుకుని షూటింగులు, థియేటర్ల పునఃప్రారంభంపై ముందుకు వెళ్తామని తెలిపారు. షూటింగుల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించామని చెప్పారు. సినిమాల చిత్రీకరణపై ప్రాధాన్యాతలు గుర్తించాలని, వాటిపై మరింత చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.. ఇక ఇదే సినీ పరిశ్రమ పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది'' అని మంత్రి తెలిపారు.

ఇక లాక్ డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకోవడానికి చిరంజీవి నేతృత్వంలో ఏర్పాటు చేసిన సీసీసీ ద్వారా దాదాపు 14వేల మంది సినీ కార్మికులను ఆదుకున్నారని, ప్రభుత్వం కూడా ఆ కార్మికులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories