ఎన్టీఆర్ సరసన వసుమతి?

ఎన్టీఆర్ సరసన వసుమతి?
x
Highlights

అయితే ఇప్పుడు ఈ లిస్టు లోకి మరో హీరోయిన్ కూడా చేరిపోయింది. ఆమె బాలీవుడ్ భామ కీయరా అద్వానీ. ఈ సినిమాలో తారక్‌ సరసన కియారా ఆడ్వాణీ అయితే బాగుంటుందని త్రివిక్రమ్‌ భావించారట.

అరవింద సమేత వీర రాఘవ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరవాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఇది ఎన్టీఆర్ కి 30వ సినిమా కావడం విశేషం.. ఈ సినిమాని హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పై రాధాకృష్ణ - కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు త్రివిక్రమ్. వచ్చే ఏడాది సమ్మర్ కి సినిమాని రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే చిత్రబృందం వెల్లడించింది.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్నది మాత్రం పెద్ద సస్పెన్స్ గా నెలకొంది. గత రెండు చిత్రాలకి పూజా హేగ్దేనే రిపీట్ చేసిన త్రివిక్రమ్ ఈ సినిమాకి కూడా పూజా ఫిక్స్ చేశాడంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ అవేమి నిజం కాలేదు. ఆ తరవాత రష్మిక మందన్నా, జాన్వీ కపూర్ పేర్లు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ లిస్టు లోకి మరో హీరోయిన్ కూడా చేరిపోయింది. ఆమె బాలీవుడ్ భామ కీయరా అద్వానీ. ఈ సినిమాలో తారక్‌ సరసన కియారా ఆడ్వాణీ అయితే బాగుంటుందని త్రివిక్రమ్‌ భావించారట. ఇప్పటికే కీయరాను త్రివిక్రమ్ సంప్రదించగా, ఆమె కూడా సుముఖత చూపించినట్టుగా సమాచారం. దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇందులో ఎన్టీఆర్ తో పాటుగా రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు.. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. 2021 జనవరి 8న రిలీజ్ చేయనున్నారు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. సినిమా పైన భారీ అంచనాలు పెరిగాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories