నా క్యారెక్టర్ కోసం కోట్ల డబ్బు వేస్ట్ చేశారు.. నటి ఖుష్బూ షాకింగ్ కామెంట్స్..

Khushboo Says that Crores Were Wasted for His Role
x

Khushboo: తన పాత్ర కోసం కోట్లు వేస్ట్ చేశారు అంటున్న ఖుష్బూ

Highlights

Khushboo: వారసుడు బృందం తన కోసం కోట్లలో డబ్బు వేస్ట్ చేసిందని అంటున్న సీనియర్ నటి

Khushboo: అటు తమిళ్ మరియు ఇటు తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి ఖుష్బూ. ప్రస్తుతం తెలుగులో గోపీచంద్ హీరోగా నటిస్తున్న "రామబాణం" సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కంటైనర్స్ లో వచ్చే ఫాస్ట్ ఫుడ్ వల్ల ఆరోగ్యం చాలా తీవ్రంగా చెడిపోతుంది.

సినిమా మొత్తం తొందరగా అయిపోతుంది అని ఫాస్ట్ ఫుడ్ ని తినే వారి మీద రన్ అవుతుంది. ఈ సినిమా ద్వారా మేము ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రమోట్ చేయాలని అనుకుంటున్నాము. అదే మా మెయిన్ మోటో," అని చెప్పుకొచ్చారు ఖుష్బూ. ఇక ఈ మధ్యనే ఖుష్బూ తలపతి విజయ్ నటించిన "వారసుడు" సినిమాలో కూడా కీలక పాత్రలో నటించారు. 18 నిమిషాల పాటు ఉండే ఆమె పాత్రను సినిమా నిడివి తగ్గించేందుకు కట్ చేసేసారు.

దీంతో సినిమాలోని ఆమె పాత్ర పూర్తిగా డిలీట్ అయిపోయింది. దీని గురించి మాట్లాడుతూ సినిమా రన్ టైం తగ్గించడం కోసం తన పాత్రని కట్ చేసేసారని కానీ విజయ్ తో తాను కొన్ని కీలక సన్నివేశాల్లో నటించిందని, దిల్ రాజు వాటిపై చాలా డబ్బులు బడ్జెట్ కూడా ఖర్చు పెట్టారని, తన పాత్ర కోసం దిల్ రాజు కోట్లలో డబ్బులు వేస్ట్ చేశారు అని షాకింగ్ కామెంట్లు చేశారు ఖుష్బూ. మంచి స్క్రిప్ట్ దొరికితే బాలకృష్ణ మరియు చిరంజీవిలతో నటించడానికి కూడా తాను సిద్ధమని ఇన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న తనకి ఇప్పటిదాకా వారితో పని చేసే అవకాశం దక్కలేదని అన్నారు ఖుష్బూ.

Show Full Article
Print Article
Next Story
More Stories