KGF డైరెక్టర్ తో ప్రభాస్ పాన్ ఇండియా మూవీ!

KGF డైరెక్టర్ తో ప్రభాస్ పాన్ ఇండియా మూవీ!
x
Highlights

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా మూవీ రానుందని తెలుస్తోంది. కేజీఎఫ్ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ సోమవారం ఒక కీలక ప్రకటన చేసింది

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా మూవీ రానుందని తెలుస్తోంది. కేజీఎఫ్ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ సోమవారం ఒక కీలక ప్రకటన చేసింది. తాము నిర్మించబోయే మరో పాన్ ఇండియా మూవీని రేపు అంటే డిసెంబర్ 02, మధ్యాహ్నం 2: 09 నిమిషాలకు వెల్లడిస్తామని ప్రకటించింది. అయితే అది ప్రభాస్ తోనే అని తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ కి ప్రశాంత్ కథ వినిపించగా, ఇంప్రెస్ అయిన డార్లింగ్ దానికి ఒకే చెప్పినట్టుగా సమాచారం. మరి కేజీఎఫ్ సినిమాతో సంచలనాలు సృష్టించిన ప్రశాంత్ నీల్ మరి ప్రభాస్ తతో సినిమాని చేసి మరెన్ని సంచలనాలు సృస్తిస్తాడో చూడాలి మరి!

ప్రస్తుతం ప్రభాస్ జిల్ మూవీ ఫేం కె. రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. పీరియాడిల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సినిమా పైన మంచి అంచనాలను కలగజేసింది. వచ్చే ఏడాది సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ తో ఓ సినిమా, బాలీవుడ్ లో అదిపురుష్ అనే సినిమాలకి కమిట్ అయ్యాడు ప్రభాస్.

Show Full Article
Print Article
Next Story
More Stories