బాలీవుడ్ ఆఫర్ అందుకున్న 'నేను లోకల్' బ్యూటీ.

బాలీవుడ్ ఆఫర్ అందుకున్న నేను లోకల్ బ్యూటీ.
x
Highlights

అప్పటిదాకా తన నటనతో మంచి మార్కులు వేయించుకుంటూ వచ్చిన కీర్తి సురేష్ 'మహానటి'సినిమా తో ఒకేసారి స్టార్ బ్యూటీ గా మారిపోయింది. అలనాటి నటి సావిత్రి...

అప్పటిదాకా తన నటనతో మంచి మార్కులు వేయించుకుంటూ వచ్చిన కీర్తి సురేష్ 'మహానటి'సినిమా తో ఒకేసారి స్టార్ బ్యూటీ గా మారిపోయింది. అలనాటి నటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించిందని చెప్పుకోవచ్చు. అయితే ఆ తర్వాత 'స్వామి 2', 'పందెంకోడి 2' సినిమాల్లో నటించింది కానీ తెలుగులో పెద్దగా కన బడలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ లో తన అడుగుపెట్టనుంది కీర్తి. స్వర్గీయ శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మాతగా త్వరలో ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా తెరకెక్కనుంది.

ఆ సినిమాలో కీర్తి సురేష్ కు ఒక మంచి పాత్ర దొరికినట్లు సమాచారం అందుతోంది. ఆయుష్మాన్ ఖురానా ల్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా 'బదాయి హో' కి దర్శకత్వం వహించిన అమిత్ శర్మ ఈ సినిమాను ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేయనున్నారు. 'బదాయి హో' సినిమాలో లేట్ ప్రెగ్నెన్సీ అనే కాన్సెప్ట్ పైన ఒక ఎంటర్టైనింగ్ సినిమాను తెరకెక్కించిన అమిత్ మరొక వినూత్నమైన ప్రాజెక్టు తో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. తన పాత్ర కూడా బాగుండటంతో కీర్తి సురేష్ ఈ సినిమాకు వెంటనే చేసుకుందని తెలుస్తుంది. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories