విజయనిర్మల బయోపిక్ లో మహానటి!

విజయనిర్మల బయోపిక్ లో మహానటి!
x
Highlights

నేను శైలజ సినిమాతో టాలీవుడ్ పరిచయమైంది హీరోయిన్ కీర్తి సురేష్. ఆ తర్వాత నాని హీరోగా నటించిన నేను లోకల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

నేను శైలజ సినిమాతో టాలీవుడ్ పరిచయమైంది హీరోయిన్ కీర్తి సురేష్. ఆ తర్వాత నాని హీరోగా నటించిన నేను లోకల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి సినిమాలో అలనాటి తార సావిత్రి పాత్రను పోషించి అందరిచేత ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకి గాను జాతీయ అవార్డును సొంతం చేసుకుంది కీర్తి సురేష్..సావిత్రి అంటే నేటి తరానికి కీర్తి సురేష్ అనేలా ఆకట్టుకుంది. ఇక తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాలో మెరిసింది..

ఇక తాజాగా ఆమె మరో బయోపిక్ లో నటించనుందని తెలుస్తుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ భార్య, దివంగత నటి విజయనిర్మల జీవిత కథ ఆధారంగా ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారని ఇందులో కీర్తి సురేష్ మెయిన్ లీడ్ లో నటించనుందని సమాచారం..ఈ సినిమాని విజయనిర్మల కుమారుడు నటుడు నరేష్ నిర్మించనున్నారని తెలుస్తోంది. మహానటి సినిమా తరువాత బయోపిక్ లు చేయను అని చెప్పిన కీర్తి సురేష్ ఇప్పుడు ఈ బయోపిక్ లో నటిస్తుందని తెలియడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక నటిగా, ద‌ర్శ‌కురాలిగా ఎన్నో పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నారు విజ‌యనిర్మ‌ల..

ప్రస్తుతం తెలుగు తమిళ చిత్రాలతో కీర్తి సురేష్ బిజీగా ఉంది.. తెలుగులో హీరో నితిన్ నటిస్తున్న రంగ్ దే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.. తాజాగా దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్ నీ చిత్ర యూనిట్ విడుదల చేసింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమాతో పాటు మిస్ ఇండియా అనే తెలుగు చిత్రంలో కీర్తి నటిస్తుంది. ఇక త‌మిళంలో అన్నాత్తి, పెంగ్విన్ చిత్రాల‌లో న‌టిస్తుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories