వారిపై కేసు పెడతా అంటున్న కౌశల్

వారిపై కేసు పెడతా అంటున్న కౌశల్
x
Highlights

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు టీవీ యాక్టర్ కౌశల్ కు మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది. కౌశల్ ఆర్మీ అంటూ అప్పట్లో వారు చేసిన హడావిడి మాములుగా ఉండేది...

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు టీవీ యాక్టర్ కౌశల్ కు మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది. కౌశల్ ఆర్మీ అంటూ అప్పట్లో వారు చేసిన హడావిడి మాములుగా ఉండేది కాదు. అయితే ఇప్పుడు అదే కౌశల్ ఆర్మీ సభ్యులు కౌశల్ కి శత్రువులుగా మారారు. ఎప్పుడూ ఫ్యాన్స్ తో డబ్బులు ఖర్చు పెట్టించాడని, ఫ్యాన్స్ ఇచ్చిన డబ్బును వృధా చేశాడని, ఫౌండేషన్ కు వచ్చిన డబ్బును మంచి పనుల కు వాడలేదని వారు వాదించారు. ఈ నేపథ్యంలో ఒక టీవీ ఛానల్ లో జరిగిన డిబేట్ లో వారందరూ కౌశల్ పైన మండిపడ్డారు. ఇప్పటి దాకా సైలెంట్ గా ఉన్న కౌశల్ తాజాగా వీటిపై రియాక్ట్ అయ్యాడు.

"మూడు నెలల క్రితం స్థాపించిన కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ కి సంబంధించిన అన్ని వివరాలు జెన్యూన్. అందులో ప్రతి రూపాయికి లెక్క ఉంది. కావాలంటే ఎవరైనా సరే ఆడిటింగ్ చేసుకోవచ్చు. నేను డబ్బు మనిషిని కాదు. వాళ్లు ఎలాంటి ఆధారాలు లేకుండా నా మీద ఆరోపణలు చేస్తున్నారు. నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞుడిని. 20 ఏళ్లు కష్టపడితే నాకు బిగ్ బాస్ అవకాశం వచ్చింది. గేమ్ ను నేను ఎంతో కష్టపడి గెలిచాను. ఆర్మీ తరపున చేసిన ప్రతి కార్యక్రమం రికార్డెడ్. కావాలంటే వివరాలు ఫేస్బుక్ లో కూడా ఉన్నాయి. నా కుటుంబాన్ని కూడా వదిలి ఆర్మీ కోసం పనిచేస్తున్నాను. నాపై ట్రోలింగ్ చేస్తున్న ఆరుగురిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తాను" అని చెప్పుకొచ్చాడు కౌశల్.

Show Full Article
Print Article
Next Story
More Stories