Jathi Ratnalu: తిరుమలలో సందడి చేసిన "జాతిరత్నాలు" టీమ్

Jathi Ratnalu Movie Team Visited Tirumala Temple
x

జాతిరత్నాలు (ఫోటో: ఫైల్ ఇమేజ్)

Highlights

Jathi Ratnalu: ఈ రోజు జాతిరత్నాలు సినిమా బృందం తిరుమలలో శ్రీవారీని దర్శించుకుంది.

Jathi Ratnalu: మంచి విజయం అందుకుని, ఫుల్ జోష్ లో వున్న జాతిరత్నాలు టీమ్ తిరుమలలో సందడి చేసింది. అనుదీప్ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. దీంతో ఈ రోజు జాతిరత్నాలు సినిమా బృందం తిరుమలలో శ్రీవారీని దర్శించుకుంది. శ్రీ‌వారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందుకున్న ఈ సినిమా టీమ్ అనంత‌రం బ‌య‌ట‌ ఫొటోల‌కు పోజులు ఇచ్చింది. ఈ సినిమాను స్వప్న సినిమాస్‌ పతాకంపై నాగ్‌ అశ్విన్ నిర్మించారు.

రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి ఈ సినిమాలో ఇతర కీల‌క పాత్ర‌ల్లో న‌టించి సినిమా స‌క్సెస్‌కు కార‌ణ‌మ‌య్యారు. సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్ వ‌ర‌కు వారు న‌వ్విస్తూనే ఉన్నారు. రాధన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. క‌రోనా కార‌ణంగా థియేట‌ర్ల‌కు దూర‌మైన ప్రేక్ష‌కుల‌ను ఈ సినిమా మ‌ళ్లీ సినిమా హాళ్ల‌కు ర‌ప్పిస్తోంది. ఈ నేప‌థ్యంలో హీరో నవీన్ పోలిశెట్టి, హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లాకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories