బిగ్ బాస్ లో వారినే ఎక్కువగా చూపిస్తారు : జాఫర్

బిగ్ బాస్ లో వారినే ఎక్కువగా చూపిస్తారు : జాఫర్
x
Highlights

Jaffar comments on BiggBoss : అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 మంచి రసవత్తరంగా సాగుతుంది. 16 మంది కంటెస్టెంట్స్‌తో మొదలైన ఈ షోలో ఇప్పటికి అరుగురు ఎలిమినేట్ అయ్యారు.

Jaffar comments on BiggBoss : అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 మంచి రసవత్తరంగా సాగుతుంది. 16 మంది కంటెస్టెంట్స్‌తో మొదలైన ఈ షోలో ఇప్పటికి అరుగురు ఎలిమినేట్ అయ్యారు. ఇందులో మొదటివారం ఎలిమినేషన్ లో సూర్యకిర‌ణ్ వెళ్ళగా, రెండోవారం కరాటే క‌ళ్యాణి, మూడోవారం దేవి నాగ‌వ‌ల్లి, నాలుగో వారం స్వాతి దీక్షిత్, అయిదోవారం సుజాత ఎలిమినేట్ అయ్యారు. అయితే ఎలిమినేషన్ లో గంగవ్వ లేకపోయినప్పటికీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆమెను హౌస్ నుంచి బయటకు వెళ్ళవలసి వచ్చింది. దీనితో మొత్తం ఆరుగురు సభ్యులు హౌస్ నుంచి వెళ్ళిపోయారు. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా HMTV కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జోర్దార్ సుజాత,కళ్యాణిలతో మాట్లాడిన యాంకర్ జాఫర్ బిగ్ బాస్ పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

ముందుగా హౌస్ నుంచి ఎలాంటి నేగిటివిటి లేకుండా వచ్చినందుకు కళ్యాణి, సుజాతకి శుభాకాంక్షలు తెలియజేశాడు జాఫర్ . కానీ ఇంకొన్ని రోజులు హౌస్ లో ఉంటే బాగుండని జాఫర్ పేర్కొన్నాడు. హౌస్ లో నుంచి బయటకు వచ్చాక మన ఎపిసోడ్స్ చూసుకోవద్దని జాఫర్ సూచించాడు. ఎందుకంటే అవి చూసుకున్నప్పుడు కొద్దిగా బాధ ఉంటుందని పేర్కొన్నాడు. అటు బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్ ను హౌస్ లొకి పంపించేముందు ఎవరికీ ఎంత స్పేస్ ఇవ్వాలో వారికి ముందే తెలుసునని అన్నారు.

ఒక ప్రేమ కథ.. ఒక కామెడీ పీస్..ఇలా బిగ్ బాస్ లో ఫార్మేట్ ఉంటుందని చెప్పిన జాఫర్.. అందుకు అనుగుణంగానే కంటెంట్ ఎడిట్ చేసి ప్రేక్షకులకు చూపిస్తారని అన్నారు. దానితోనే ప్రేక్షకుల్లో ఒక అభిప్రాయం ఏర్పడిపోతుందని చెప్పారు. ప్రస్తుతం హౌస్ లో సుజాత,కల్యాణి, దేవి నాగవల్లి అలా ఏ ఫార్మేట్ కూ చిక్కలేదన్న జాఫర్ తాను బిగ్ బాస్ లో ఉన్నపుడే అది గమయించానని చెప్పారు. అందుకే రెండో వారమే తనను పంపించేయమని బిగ్ బాస్ ను అడిగానని తెలిపారు.

ఇదే బిగ్ బాస్ 4లో కూడా ఇదే జరుగుతుందని అన్నారు జాఫర్.. ఇక కళ్యాణి స్ట్రయిట్ ఫార్వార్డ్ గా మాట్లాడుతుంది కాబట్టి ఆమెను మరిన్ని రోజులు ఉంటుందని అనుకున్నాని కానీ రెండవవారం రావడం ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. మొత్తం 16 మందితో ఉండే షో అయినప్పటికీ కేవలం అయిదారుగురు పైన ఫోకస్ ఉంటుందని జాఫర్ అభిప్రాయపడ్డాడు.. అటు జాఫర్ బిగ్ బాస్ మూడవ సీజన్ లో పాల్గొని రెండవ ఎలిమినేషన్ గా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే..



Show Full Article
Print Article
Next Story
More Stories