దిశా హత్యోదంతం లో వంకరగా స్పందించిన నెటిజన్లపై జబర్దస్త్ అనసూయ తిట్ల దండకం అందుకున్నారు!
దేశ వ్యాప్తంగా సంచలనం గా మారిన దిశా హత్యోదంతం పై నెట్టింట్లో రకరకాల వ్యాఖ్యలు వస్తున్నాయి. ఈ కోవలో యాంకర్ అనసూయను వదల్లేదు నెటిజన్లు. ఈ ఘటనపై ఎందుకు స్పందించలేదంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆ వ్యాఖ్యలపై అనసూయ అంతకంటే తీవ్రంగా స్పందించారు.
నేను స్పందించలేదని అంటున్నారు సరే..మీరు ఏం పీ** అంటూ విరుచుకు పడ్డారు. జరిగే ప్రతి సంఘటనపై స్పందించాలని లేదు. దిశా ఉదంతం తీవ్రంగా ఖండించాల్సిందే. కానీ, నేను స్పందించలేదంటూ కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు అంటూ మొదలెట్టిన అనసూయ నెట్టింట్లో దిశా ఉదంతం పై వంకరగా స్పందించిన ప్రతి ఒక్కరి పేరు..వారి ట్వీట్ లు బయటకు తీసి మరీ బూతు పురాణం వల్లించారు.
అసలు మీరెవరు?
ఈ ప్రశ్న ఇంత సాఫ్ట్ గా అడగలేదు అనసూయ. అసలు ఆడవాళ్లు ఎలా ఉండాలో చెప్పడానికి మీరెవరురా.. అంటూ ఆవేశంగా ప్రశ్నించారు అనసూయ. ఢిల్లీ లో జరిగిన ఘటనలో ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలూ లేవు. ఆడాళ్ళు జాగ్రత్త గా ఉండాలి అని చెబుతున్నారు. మా జాగ్రత్తలో మేమున్నా చంపేస్తున్నారు కదరా ఇంకేం చేయాలి అని ఘాటుగా ప్రశ్నించారు. దిశ ఘటన తరువాత భయం మొదలైందని అనసూయ అన్నారు. బయటకు రోడ్డు మీద తిరగకూడదా.24 గంటలూ మమ్మల్ని ఎవరు చూస్తున్నారు అనే విషయాన్ని గమనించుకుంటూ ఉండాలా అంటూ ఆమె ప్రశ్నించారు.
ఇంట్లో నుంచే మొదలవ్వాలి..
ముందు ఇంట్లో నుంచే మొదలవ్వాలి ఆడబిడ్డల్ని ఎలా పెంచాలి అనేది. మగపిల్లలకు నేర్పించాలి.. ఆడపిల్లలకు ఎలా గౌరవం ఇవ్వాలి. వారితో ఎలా మసలుకోవాలి.. వంటి విషయాలు. మన ఇంటి నుంచే ఈవిషయాన్ని మీ పిల్లలకు నేర్పించండి అంటూ చెప్పుకొచ్చారు అనసూయ.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire