సలార్‌పై ఇప్పటి నుంచే భారీ హైప్..! ఇండియన్ సినిమా లెక్క మారబోతోందా?

Hype Behind Over Prabhass Salaar Movie
x

సలార్‌పై ఇప్పటి నుంచే భారీ హైప్..! ఇండియన్ సినిమా లెక్క మారబోతోందా?

Highlights

Salaar: రిలీజ్‌కి ముందే ప్రభాస్, ప్రశాంత్ కాంబో సినిమా ప్రపంచాన్ని షేక్ చేసేస్తోంది.

Salaar: రిలీజ్‌కి ముందే ప్రభాస్, ప్రశాంత్ కాంబో సినిమా ప్రపంచాన్ని షేక్ చేసేస్తోంది. సలార్ కేజీఎఫ్‌కా బాప్ అన్న అంచనాలు ఇండియన్ సినిమానే ఊపేస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే మేకర్స్ సైతం ఇది అంతకుమించి అన్న ప్రచారం చేస్తుండడం బాహుబలి ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. ఇంతకూ, ప్రభాస్, ప్రశాంత్ నీల్‌ కాబోలో వస్తున్న సలార్‌ ఎలాంటి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ కాబోతోంది. సలార్ విడుదలకు చాలా సమయం ఉండగానే ఈ రేంజ్‌ చర్చ ఎందుకు జరుగుతోంది..? ఇంటర్ నేషనల్ స్క్రీన్లపై ఇండియన్ అవెంజర్స్‌ను చూడబోతున్నామా..? కేజీఎఫ్ 3లో ప్రభాస్ నటిస్తున్నాడన్న వార్తల్లో నిజమెంత..?

సలార్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేజీఎఫ్ రెండు పార్స్ట్ జస్ట్ ట్రైలర్ మాత్రమే అట ఒకటికి మూడురెట్లు డార్లింగ్ సినిమా రచ్చ చేయడం ఖాయమట ప్యాన్ ఇండియా కాదు, ఇంటర్ నేషనల్ స్క్రీన్లే షేక్ ఐపోతాయట.. ఈ మాటలు చెబుతోంది స్వయంగా సలార్ యూనిట్టే. ఇందులో ఏముంది ప్రతి మూవీ మేకర్స్ చెప్పేదేగా అనుకోవడానికి లేదు. ఎందుకంటే సలార్‌ను చెక్కుతోంది జక్కన్నకు ఏమాత్రం తీసిపోని ప్రశాంత్ నీల్ కావడమే. దీంతో సినిమా ప్రపంచంలో సలార్‌పై ఉత్కంఠ అంతకంతకూ పెరిగిపోతుంది. ఈ భారీ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ప్రాంతాలతో సంబంధం లేకుండా సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇంతకూ, ఇండియన్ సినిమాకు సలార్ ఎందుకంత ప్రత్యేకం..? ఈ ప్రాజెక్టుతో నిజంగానే సినిమా హద్దులు చెరిగిపోతాయా..?

ప్రశాంత్ నీల్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్‌కు బాహుబలి లాంటి కటౌట్ దొరికితే..? ఈ ఆలోచనే సినీ ప్రపంచాన్ని షేక్ చేసేస్తోంది. ది మోస్ట్ వైలెంట్ మెన్ అంటూ ఇప్పటికే విడుదల చేసిన టీజర్ సైతం ఓ రేంజ్‌లో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. టీజర్‌కే పరిస్థితి ఇలా ఉంటే సిల్వర్ స్క్రీన్‌పై బొమ్మ పడితే ఇంకెలా ఉంటుందో అన్న భారీ అంచనాలతో ఎక్కడ చూసినా సలార్ మేనియానే కనిపిస్తోంది. ఇలాంటి సమయంలోనే ఈ భారీ ప్రాజెక్టుపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇందుకు కారణం రీసెంట్ కేజీఎఫ్ 2 బంపర్ హిట్ కొట్టడమే. ఈ సినిమా ఏమాత్రం యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకున్నా పరిస్థితి మరోలా ఉండేదేమో కానీ బాలీవుడ్ లాంటి ఇండస్ట్రీని నిద్రపోకుండా చేసేయడంతో ఈ సారి అంతకుమించిన రిజల్ట్ ఖాయం అన్న అంచనాలున్నాయి.

నిజానికి ఇండియన్ బాక్సాఫీస్‌పై కేజీఎఫ్ దండయాత్రతో దూకుడుమీదున్న ప్రశాంత్ నీల్ సరికొత్త టార్గెట్స్ ఫిక్స్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. రాజమౌళి లానే పదే పదే ఇండియన్ సినిమా మాటెత్తే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఈసారి కుంభస్థలాన్ని కొట్టేందుకే సిద్ధమయ్యారు. తన టార్గెట్ ఎంతమాత్రం బాలీవుడ్ కాదని, ఇండియా బయట సరికొత్త రికార్డులను తిరగరాయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బాహుబలితో ప్రపంచ స్థాయి అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్‌ను ఎంచుకుని, కేజీఎఫ్‌ను మించిన కథ, యాక్షన్ సీక్వెల్స్‌తో ఓ రేంజ్‌‌లో హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా మూవీని మలుస్తున్నారన్న వార్తలొస్తున్నాయి. ఇందులో భాగంగానే మూవీ మేకర్స్ కాన్ఫిడెంట్‌గా సలార్ దెబ్బకు గ్లోబల్ స్క్రీన్లు షేక్ అయిపోవడమే ఖాయమన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ప్రశాంత్ నీల్ అనుకున్నది అనుకున్నట్టే జరిగితే ఇండియన్ సినిమా లెక్కలు మారిపోవడమే కాదు అంతర్జాతీయ వేదికపై ఇండియన్ సినిమాకు ప్రత్యేక స్థానం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

అయితే, హాలీవుడ్ స్థాయిలో సక్సెస్ కావాలాంటే ఏం చేయాలన్న అంశంపై ఇప్పటికే ప్రశాంత్ నీల్ గ్రౌండ్‌ వర్క్‌ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే క్రాసోవర్ పాయింట్‌ను తెరపైకి తెచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మార్వెల్స్ ఎవెంజర్స్ మాదిరిగా యశ్, ప్రభాస్‌‌ ఇద్దరినీ ఒకేసారి స్క్రీన్‌పై దించి సినిమా లెక్కలు చెరిపేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు ఇంతవరకూ ఇండియాలోనే జరిగిన కేజీఎఫ్ కథ ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చారు. అందుకే కేజీఎఫ్ 2 చివర్లో రాకీభాయ్‌ ప్రయాణిస్తున్న షిప్‌ని అమెరికా, ఇండోనేషియా దేశాలకు చెందిన అధికారులు వెంటాడుతున్నట్టు చూపించారు. రాకీభాయ్ సామ్రాజ్యం విదేశాలలో కూడా విస్తరించినట్లు చూపించే ప్రయత్నం చేశారు. ఈ కొత్త కథలోకి ప్రభాస్‌ను దించితే అంచనాలను మరింత పెంచడంతో పాటు ప్రపంచ సినిమా అటెన్షన్ సాధించొచ్చన్నది ప్రశాంత్ నీల్ ఆలోచనగా కనిపిస్తోంది. ఒకవేళ కేజీఎఫ్ 3లో ప్రభాస్ ఎంట్రీ కనుక నిజమైతే సిల్వర్ స్క్రీన్‌పై ఊహించని విధ్వంసం జరగడం ఖాయం.

మరోవైపు కేజీఎఫ్ 3లో బాహుబలిని రంగంలోకి దించాలంటే ముందు సలార్‌ను అంతకుమించిన హిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఆ పనిలోనే తలమునకలై ఉన్నారు. యశ్ లాంటి హీరోతోనే ఓ రేంజ్ మాస్ ఎలివేషన్స్‌తో రచ్చ చేసిన ప్రశాంత్ ప్రభాస్ సలార్‌లో అంచనాలకు మించిన యాక్షన్ సీక్వెన్స్‌లకు కొదవే లేదన్న హింట్ ఇస్తున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ప్రశాంత్ అంచనాలను చేరుకోగలిగితే ఆ మరుక్షణమే కేజీఎఫ్ 3పై కీలక అప్‌డేట్ ప్రకటించనున్నారన్న వార్తలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఆ వార్త ప్రభాస్‌ ఎనౌన్స్‌మెంటే అయితే అదో సంచలనం కావడం ఖాయం. అదే జరిగితే ఇంటర్ నేషనల్ స్క్రీన్లపై ఇండియన్ అవెంజర్స్ రచ్చ చేసేందుకు అదే ముహూర్తం అవుతుంది కూడా. దీంతో సలార్‌‌పై రోజురోజుకూ అంచనాలు రెట్టింపవుతున్నాయి.

నిజానికి ఇండియన్ సినిమాను అంతర్జాతీయ వేదికపై మెరిసేలా చేసిన జక్కన్న సైతం సినిమా సినిమాకు లెక్క మారుస్తూ, విజయం సాధిస్తు ఈ స్థాయికి వచ్చారు. రాజమౌళి సినిమాల్లో ఒకదాన్ని మించి మరొకటి ఉండేలా ప్లాన్ చేసి ప్రేక్షకుల అంచనాలను అవదుకుంటున్నారు. ఇప్పుడు ప్రశాంత్ సైతం అదే బాటలో నడుస్తున్నట్టు కనిపిస్తోంది. కేజీఎఫ్ హిట్‌తో సీక్వెల్ సక్సెస్ అవుతుందా అన్న అనుమానాలున్న వేళ అంతకుమించిన విజయం ఖాతాలో వేసుకుని తనకు తిరుగేలేదని నిరూపించారు. తాజాగా సలార్‌ను కేజీఎఫ్‌ను మించిన హిట్ చేసి ఇండియన్ అవెంజర్స్‌కు తెరలేపాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. మొత్తంగా ప్రశాంత్‌ నీల్, ప్రభాస్ కాంబో రిలీజ్‌కు ముందే లెక్కకుమించిన అంచనాలతో సినిమా ప్రపంచాన్నే షేక్ చేస్తోంది. ఒక్కమాటలో కేజీఎఫ్ డైరెక్టర్ సలార్ తర్వాత కేజీఎఫ్ 3 రూపంలో ఇండియన్ అవెంజర్స్‌కు రంగం సిద్ధం చేస్తే ఇండియన్ సినిమా అంతర్జాతీయ స్క్రీన్‌పై చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం.

Show Full Article
Print Article
Next Story
More Stories