విడాకులు తీసుకున్న టాలీవుడ్ సింగ‌ర్‌, హీరోయిన్‌

విడాకులు తీసుకున్న టాలీవుడ్ సింగ‌ర్‌, హీరోయిన్‌
x
Highlights

గ‌త ఏడాది జ‌న‌వ‌రిలో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నటుడు, గాయకుడు నోయెల్‌, హీరోయిన్ ఎస్తే‌ర్ తాజాగా విడాకులు తీసుకున్నారు. వారిద్దరు తమ...

గ‌త ఏడాది జ‌న‌వ‌రిలో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నటుడు, గాయకుడు నోయెల్‌, హీరోయిన్ ఎస్తే‌ర్ తాజాగా విడాకులు తీసుకున్నారు. వారిద్దరు తమ ట్విట్టర్‌ ఖాతాలో ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరి మ‌ధ్య ఐదారు నెల‌ల‌కే స‌ర్దుబాటు స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. గ‌త ఏడాది జూన్‌లో ఇద్ద‌రూ మ్యూచువ‌ల్ డైవోర్స్‌కు అప్ల‌య్ చేసుకున్నారు. వీరిద్ద‌రికీ విడాకులు మంజూరు చేస్తున్న‌ట్లు కోర్టు తీర్పునిచ్చింది. అభిప్రాయ భేదాల కారణంగా తాము విడిపోతున్నామని, తమ మధ్య ఉన్న అందమైన బంధాన్ని, దాని విలువను కాపాడుకునేందుకు ఇదే సరైన నిర్ణయమని భావిస్తున్నట్లు నోయెల్ చెప్పుకొచ్చాడు. ఎస్తర్‌ భవిష్యత్‌ బాగుండాలని, తనకు అంతా మంచే జరగాలని, తను కన్న కలలు నిజం కావాలని ఆకాంక్షించాడు. విడాకుల విషయంలో తన కుటుంబాన్ని గానీ, ఎస్తర్‌ను గానీ ఇబ్బంది పెట్టేలా వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశాడు. అలాగే కష్ట సమయాల్లో తనకు తోడుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి నోయల్‌ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. సరికొత్త ఆశలతో కొత్త జీవితానికి స్వాగతం పలికేందుకు సిద్ధమైనట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు ట్విట్టర్‌ ఖాతాలో ఓ నోట్‌ను షేర్‌ చేశాడు.

మరోవైపు, తాను అన్ని విష‌యాల్లో సూటిగా, నిజాయ‌తీగా ఉంటాన‌ని ఎస్తర్ చెప్పుకొచ్చింది. తమ విడాకులపై ఇంత కంటే ఎక్కువ‌గా స్పందించ‌లేన‌ని చెప్పుకొచ్చింది. కాగా ప్రముఖ డైరెక్టర్‌ తేజ దర్శకత్వం వహించిన 'వెయ్యి అబద్ధాలు' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఎస్తర్, ప్రస్తుతం తెలుగు, తమిళ్‌, మరాఠీతో పాటు హిందీ సినిమాలతో బిజీగా ఉన్నట్లు సమాచారం.





Show Full Article
Print Article
Next Story
More Stories