క్రేజీ టైటిల్ తో సుశాంత్ కొత్త సినిమా

క్రేజీ టైటిల్ తో సుశాంత్ కొత్త సినిమా
x
Highlights

అక్కినేని మూడో తరం కథానాయకుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు సుశాంత్..

అక్కినేని మూడో తరం కథానాయకుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు సుశాంత్ ..2008 లో కాళీదాసు అనే చిత్రంలో నటించాడు. ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది. ఆ తర్వాత కరెంట్ అనే చిత్రంలో నటించాడు సుశాంత్.. ప్యూర్ లవ్ స్టొరీగా తెరకెక్కిన ఈ సినిమా సుశాంత్ కి మంచి హిట్టును ఇచ్చింది. ఆ తర్వాత చేసిన అడ్డా, ఆటాడుకుందాంరా సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి.

ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సుశాంత్ సినిమాలకి బ్రేక్ ఇచ్చి కథలు వింటూ వచ్చాడు. ఈ నేపద్యంలో హీరో నుంచి దర్శకుడిగా మారినా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో చి.ల.సౌ అనే సినిమాని చేసి మంచి హిట్టు కొట్టాడు. డిసెంట్ ఫిలిం గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమా తర్వాత సుశాంత్ కి మంచి పేరు వచ్చింది.

వచ్చిన సక్సెస్ ని కాపాడుకుంటూ కథల ఎంపికలో జాగ్రత్తలు వ్యవహరిస్తున్నాడు ఈ కుర్ర హీరో.. అందులో భాగంగానే మరో వినూత్నమైన కథకి ఒకే చెప్పాడు. ఎస్ ద‌ర్శన్ ద‌ర్శ‌క‌త్వంలో సుశాంత్ తన 7వ చిత్రంగా "ఇచ్చట వాహ‌న‌ములు నిలుప‌రాదు" అనే టైటిల్ తో సినిమా వస్తుంది. నో పార్కింగ్ అనేది క్యాప్షన్‌. య‌దార్ధ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమాని తెర‌కెక్కస్తున్నారు.ఈ చిత్రాన్ని ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జనవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇక ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న అల‌.. వైకుంఠ‌పుర‌ములో గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి పండగకి కానుకగా జనవరి 12న ఈ సినిమాని విడుదల చేయనున్నారు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.






Show Full Article
Print Article
More On
Next Story
More Stories