క్రిస్మస్‌కి థియేటర్లలోకి 'సోలో బ్రతుకే సో బెటర్'

క్రిస్మస్‌కి థియేటర్లలోకి సోలో బ్రతుకే సో బెటర్
x
Highlights

ఈ సంవత్సరం మనం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నామో మనందరికీ తెలుసు. ఈ సమయంలో ప్రేక్షకులను అలరించడానికి మేము సిద్ధమవుతున్నాము.

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం సోలో బ్రతుకే సో బెటర్.. శ్రీ వెంక‌టేశ్వర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించగా, సుబ్బు ద‌ర్శక‌త్వం వహించారు. ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సంస్థ విడుదల చేస్తోంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల చేయనున్నట్టుగా శనివారం అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

ఈ సందర్బంగా హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ "ఈ సంవత్సరం మనం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నామో మనందరికీ తెలుసు. ఈ సమయంలో ప్రేక్షకులను అలరించడానికి మేము సిద్ధమవుతున్నాము. క్రిస్మస్ సందర్బంగా మా సినిమా థియేటర్లలోకి రావడం ఆనందంగా ఉంది. అన్ని ఎమోష‌న్స్ ఉన్న ఈ సినిమా ఫుల్ ప్యాక్‌డ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా డిసెంబ‌ర్ 25న మీ ముందుకు వ‌స్తోంది" అని అన్నారు.

అటు నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ.. ''మా సినిమాను క్రిస్మస్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 25న విడుద‌ల చేస్తుండ‌టం చాలా ఆనందంగా ఉంది. మా సినిమా అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంద‌ని న‌మ్ముతున్నాం'' అని అన్నారు. ఇక ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తుండగా, వెంకట్ సి. దిలీప్ సినిమాటోగ్రఫీ అందించారు. గత ఏడాది క్రిస్మస్‌ సందర్బంగా ప్రతి రోజూ పండగే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ కొట్టాడు సాయి తేజ్.


Show Full Article
Print Article
Next Story
More Stories