1650 ఎకరాల అటవీప్రాంతాన్ని దత్తత తీసుకున్న బాహుబలి !

1650 ఎకరాల అటవీప్రాంతాన్ని దత్తత తీసుకున్న బాహుబలి !
x
Highlights

హీరో ప్రభాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జిన్నారం మండలం ఖాజీపల్లి అటవీ ప్రాంతాన్ని ప్రభాస్‌ దత్తత తీసుకున్నారు. దుండిగల్‌ సమీపంలోని...

హీరో ప్రభాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జిన్నారం మండలం ఖాజీపల్లి అటవీ ప్రాంతాన్ని ప్రభాస్‌ దత్తత తీసుకున్నారు. దుండిగల్‌ సమీపంలోని ఖాజీపల్లి అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌ను అటవీ శాఖమంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎంపీ సంతోష్‌ కుమార్‌తో కలిసి ప్రభాస్ సోమవారం పరిశీలించారు. అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుకు శంకుస్థాపన చేసిన బాహుబలి మొక్కలు నాటారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ సంతోశ్‌కుమార్ చొరవ‌తో పార్కును ద‌త్త‌త తీసుకుంటున్న‌ట్లు ప్ర‌భాస్ తెలిపారు.

1,650 ఎకరాల అటవీ భూమిని ద‌త్త‌త తీసుకొని త‌న తండ్రి పేరిట అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. త‌క్ష‌ణ సాయంగా రూ.2 కోట్లు అంద‌జేసిన‌ ప్ర‌భాస్ అవ‌స‌రాన్ని బ‌ట్టి మ‌రింత సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు. మంత్రి, ఎంపీతో క‌లిసి హీరో ప్ర‌భాస్ పార్కులోని వ్యూ పాయింట్‌, త‌దిత‌ర సౌక‌ర్యాల‌ను ప‌రిశీలించి, రావి, జువ్వి, కుసుమ మొక్క‌ల‌ను పార్కులో నాటారు. కార్యక్రమంలో ప్ర‌భుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పీసీసీఎఫ్ శోభ, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories