తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నితిన్ దంపతులు, నటుడు సాయి కుమార్
Nithin And Sai Kumar (reprasentatiomal image)
తిరుమల శ్రీవారిని హీరో నితిన్ దంపతులు, నటుడు సాయి కుమార్ దర్శించుకున్నారు. వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదించితీర్ధ ప్రసాదాలు అందజేసారు. తిరుపతిలో నిర్వహించిన ఏపీ పోలీస్ డ్యూటీ మీట్ కు తనను గెస్ట్ గా పిలవడంపై సాయి కుమార్ ఆనందం వ్యక్తం చేశారు.ఈ జనవరి 26కు పోలీస్ స్టోరీ సినిమా విడుదలై 25 ఏళ్లు అవుతుందని, అలాగే ఈ ఏడాది తాను షష్టి పూర్తి చేసుకుంటున్నట్లు సాయికుమార్ వెల్లడించారు.
Next Story




