ఆ సినిమాలో నుంచి నన్ను తీసేశారు.. హీరో అడివి శేష్ సంచలన కామెంట్స్..

Adivi Sesh: కరోనా కి ముందు "ఎవరు" అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యువ హీరో అడవి శేష్ మళ్ళీ ఇన్నాళ్ళకు "మేజర్" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Arun Chilukuri
Published on: 13 May 2022 3:20 PM IST
Hero Adivi Shesh Interesting Comments
X

ఆ సినిమాలో నుంచి నన్ను తీసేశారు.. హీరో అడివి శేష్ సంచలన కామెంట్స్..

Adivi Sesh: కరోనా కి ముందు "ఎవరు" అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యువ హీరో అడవి శేష్ మళ్ళీ ఇన్నాళ్ళకు "మేజర్" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శశికిరణ్ తిక్క ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్ మరియు ఏ ప్లస్ ఎస్ మూవీస్ పతాకాలపై మహేష్ బాబు నిర్మాతగా ఈ సినిమా జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడవి శేష్ నటన అద్భుతంగా ఉండబోతోందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అడవి శేష్ తన కెరియర్ గురించి మరియు తన ఎదుర్కొన్న అవమానాల గురించి మీడియాతో షేర్ చేసుకున్నారు. "చందమామ సినిమాలో ముందు నన్నే హీరోగా తీసుకున్నారు, నవదీప్ చేసిన పాత్రను నేనే చేయాల్సి ఉంది. రెండు రోజుల పాటు షూటింగ్ కూడా జరిగింది కానీ ఆ తర్వాత సినిమా క్యాన్సిల్ అయింది. సొంతం సినిమాలో కూడా పెద్ద రోల్ ఉందని చెప్పి 5 సెకండ్లు మాత్రమే ఇచ్చారు" అని చెప్పుకొచ్చారు అడివి శేష్. ఇక "మేజర్" సినిమా గురించి మాట్లాడుతూ సందీప్ ఉన్నికృష్ణన్ ఎలా చనిపోయాడో అందరికీ తెలుసు కానీ ఎలా బతికాడు అనేది ఎవరికీ తెలియదు అని, అది ఈ సినిమా తెలియజేస్తుంది" అని అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story