'గుండె జారి గల్లంతయ్యిందే' సీక్వెల్ రాబోతోందా?

గుండె జారి గల్లంతయ్యిందే సీక్వెల్ రాబోతోందా?
x
Highlights

2013లో దర్శకుడు విజయ్ కుమార్ కొండ 'గుండెజారి గల్లంతయ్యిందే' అనే సినిమాతో హిట్ అందుకున్నాడు. నితిన్, నిత్యామీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మంచి...

2013లో దర్శకుడు విజయ్ కుమార్ కొండ 'గుండెజారి గల్లంతయ్యిందే' అనే సినిమాతో హిట్ అందుకున్నాడు. నితిన్, నిత్యామీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కానీ ఆ తర్వాత విజయ్ కుమార్ దర్శకత్వం వహించిన 'ఒక లైలా కోసం' సినిమా హిట్ అవ్వలేకపోయింది. నాగచైతన్య, పూజ హెగ్డే నటించిన ఈ సినిమా ఫ్లాప్ అయిన తరువాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు విజయ్ కుమార్. అయితే దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ దర్శకుడు మళ్ళీ ఇండస్ట్రీలో రీ-ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది.

తాజా సమాచారం ప్రకారం విజయ్ కుమార్ ఈ మధ్యనే నితిన్ ను కలిసి ఒక కథ వినిపించారట. నితిన్ కి కూడా కథ బాగానే నచ్చటంతో చేయడానికి ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. అయితే ఈ సినిమా 'గుండెజారి గల్లంతయింది' సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కనుందని పుకార్లు వినిపిస్తున్నాయి. వాటిలో ఎంత వరకు నిజం ఉందో ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ మధ్యనే 'శ్రీనివాస కళ్యాణం' అనే సినిమాతో డిజాస్టర్ అందుకున్న నితిన్, వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories