మళ్లీ 'సాహసం' నిర్మాతలతో చేయి కలపనున్న గోపి చంద్

మళ్లీ సాహసం నిర్మాతలతో చేయి కలపనున్న గోపి చంద్
x
Highlights

ఈ మధ్యనే 'పంతం' సినిమాతో మరొక డిజాస్టర్ ను నమోదు చేసుకున్న హీరో గోపీచంద్ ప్రస్తుతం తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే....

ఈ మధ్యనే 'పంతం' సినిమాతో మరొక డిజాస్టర్ ను నమోదు చేసుకున్న హీరో గోపీచంద్ ప్రస్తుతం తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు కానీ అప్పుడే మరొక సినిమా లైన్లో పెట్టాడు గోపీచంద్. ఈసారి గోపీచంద్ తనకు సాహసం వంటి సూపర్ హిట్ ను అందించిన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం వారితో చేయి కలపనున్నాడు గోపిచంద్. బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు ప్రొడక్షన్ సంస్థ వారు.

"'సాహసం' ఇలాంటి సూపర్ హిట్ తరువాత మళ్లీ గోపి చంద్ తో మా తదుపరి సినిమా ఉండబోతోంది అని చెప్పటం సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం పూర్తి అయింది. కొత్త దర్శకుడు బిను సురమణ్యం ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. కే సతీష్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి మొదలవనుంది. మరిన్ని వివరాలు త్వరలో విడుదల చేస్తాము" అని పూజ కార్యక్రమం నుంచి కొన్ని ఫోటోలను కూడా షేర్ చేశారు. తాప్సీ హీరోయిన్ గా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సాహసం' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం గోపీచంద్ కు ఎంత వరకు కలిసి వస్తుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories