మహేష్ సినిమాలో అనుష్క.. నిజమెంత?

మహేష్ సినిమాలో అనుష్క.. నిజమెంత?
x
Highlights

అయితే ఇప్పుడో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో అనుష్క శెట్టి ఓ ముఖ్యపాత్ర పోషిస్తుందని అంటూ వార్తలు వస్తున్నాయి. ఓ పవర్‌ఫుల్‌ బ్యాంకు మేనేజర్‌గా అనుష్కశెట్టి కనిపించనుందన్నదని ఆ వార్తల సారాంశం అన్నమాట.

ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ హిట్ కొట్టిన మహేష్ బాబు ప్రస్తుతం పి. పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. పూజా కార్యక్రమాలతో నిన్న మొదలైన ఈ సినిమా జనవరి రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

అయితే ఇప్పుడో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో అనుష్క శెట్టి ఓ ముఖ్యపాత్ర పోషిస్తుందని అంటూ వార్తలు వస్తున్నాయి. ఓ పవర్‌ఫుల్‌ బ్యాంకు మేనేజర్‌గా అనుష్కశెట్టి కనిపించనుందన్నదని ఆ వార్తల సారాంశం అన్నమాట. కానీ దీనిపైన చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికార ప్రకటన వెలువడలేదు. తాజాగా ఈ వార్తల్లో నిజం లేదని తేలింది.

ఎవరో ఓ అపరిచిత వ్యక్తి దర్శకుడు పి. పరుశురామ్‌ పేరుతో ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేశాడు. అందులో ''సర్కారువారి పాట'లో అనుష్క ఓ పాత్ర పోషిస్తుండటం సంతోషంగా ఉంది. ఆమె ఈ సినిమాలో అదరగొడుతుందన్న నమ్మకం ఉంది. షూటింగ్‌ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం''అంటూ పోస్టు చేశాడు. దీనితో అందరూ సినిమాలో అనుష్క నటిస్తుందంటూ న్యూస్ స్ప్రెడ్ అయింది.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మైత్రి మూవీ మేకర్స్, ఎంబీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నాడు. మే లో సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇది మహేష్ బాబు కూడా 27 వ సినిమా కావడం విశేషం. మధి సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories