'లక్ష్మీస్ ఎన్టీఆర్' కి పర్మిషన్ వచ్చేసింది.

లక్ష్మీస్ ఎన్టీఆర్ కి పర్మిషన్ వచ్చేసింది.
x
Highlights

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న వివాదాస్పద చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా...

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న వివాదాస్పద చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా కథ ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి చుట్టూ తిరుగుతుందని తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన రెండు థియేట్రికల్ ట్రైలర్ లు

ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను ఎన్నికలకు ముందే విడుదల చేయాలని అనుకుంటున్న వర్మ మార్చి 29 ని విడుదల తేదీగా ప్రకటించారు కానీ ఈ సినిమా విడుదల పై చాలా అనుమానాలు రేకెత్తాయి.

అయితే తాజాగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' నిర్మాత రాకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సినిమా విడుదల పై క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను అనుకున్న తేదీకి విడుదల చేయడానికి ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇచ్చిందని చెప్పారు. అంతేకాకుండా మీడియా సర్టిఫికేషన్ మరియు మానిటరింగ్ కమిటీ తో కూడా ఈ సినిమా ఎవరి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండదని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సినిమా విడుదల తర్వాత ఏమైనా ప్రాబ్లం వస్తే చిత్ర బృందం దానిని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాంగోపాల్ వర్మ మరియు అగస్త్య మంజు సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories