తండ్రి తో అయిపోయింది.. ఇప్పుడు కొడుకు తో..

తండ్రి తో అయిపోయింది.. ఇప్పుడు కొడుకు తో..
x
Highlights

ప్రజానేత, ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా 'యాత్ర'. వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి...

ప్రజానేత, ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా 'యాత్ర'. వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా నటించారు. మహి వి రాఘవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా పెద్దగా రికార్డులు ఏమి సృష్టించక పోయినా బయర్లను మాత్రం సేఫ్ జోన్ లోకి తీసుకువచ్చింది. మహి వి రాఘవ్ దర్శకత్వం సినిమాకు బాగా ప్లస్ అయింది. ఇక ఈ సినిమా తర్వాత మహి వి రాఘవ్ కు చాలానే ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తుంది. కానీ తదుపరి సినిమా విషయంలో తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు మహి.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ దర్శకుడికి దుల్కర్ సల్మాన్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందట. తన తండ్రి మమ్మూట్టి ని వైఎస్ఆర్ పాత్రలో అద్భుతంగా చూపించినందుకు దుల్కర్ సల్మాన్, మహి వి రాఘవ్ ను ప్రత్యేకంగా అభినందించారట. అంతేకాకుండా మంచి సబ్జెక్ట్ ఏమన్నా ఉంటే తప్పకుండా కలిసి సినిమా చేద్దాం అని మాట కూడా ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేవలం మమ్ముట్టి తనయుడిగా కాక దుల్కర్ సల్మాన్ తనకంటూ ఒక గుర్తింపును ప్రతి భాషలోనూ ఏర్పరచుకున్నారు. ఇప్పటికే తెలుగు, హిందీ, తమిళం, మలయాళం సినిమాల్లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు దుల్కర్ సల్మాన్. ఈ మధ్యనే 'మహానటి' సినిమాలో కూడా కనిపించిన దుల్కర్ మహి దర్శకత్వంలో ఎప్పుడు నటిస్తాడో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories