సుజీత్ కి ఛాన్స్ ఇచ్చిన కుర్ర హీరో ?

దర్శకుడు సుజీత్
x
దర్శకుడు సుజీత్
Highlights

కథ లేకుండా భారీ ఖర్చు పెట్టి తీశారని విమర్శించారు. ఆ తర్వాత దర్శకుడు సుజీత్ కూడా ఎక్కడ కనిపించింది లేదు.

షార్ట్ ఫిలిమ్స్ నుంచి డైరెక్టర్ అయ్యాడు సుజీత్.. శర్వానంద్ హీరోగా వచ్చిన రన్ రాజా రన్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అద్భుతమైన కథనంతో సినిమాని తీసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు సుజీత్ . సరిగ్గా 25 ఏళ్ళు లేవు కానీ అప్పుడే డైరెక్టర్ అయిపోయి హిట్టు కూడా కొట్టాడని అందరు సుజీత్ గురించి మాట్లాడుకున్నారు. దీనితో బాహుబలి లాంటి భారీ హిట్టు తర్వాత ప్రభాస్ ఏరికోరి మరి సుజీత్ కి ఆఫర్ ఇచ్చాడు.

వీరి కాంబినేషన్ లో సాహో అనే సినిమా వచ్చింది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో యువీ క్రియేషన్స్ తెరకేక్కించింది. ఈ సినిమాలో శ్రద్దాకపూర్ హీరోయిన్ గా నటించింది. అయితే సినిమాకి మొదటి రోజు మిశ్రమ స్పందన లభించింది. ఆ తర్వాత సినిమా 400 కోట్లు వరకు వచ్చినట్టుగా చిత్ర యూనిట్ అధికారకంగా ప్రకటించింది. కానీ సినీ క్రిటిక్స్ మాత్రం సినిమాలో కథ లేకుండా భారీ ఖర్చు పెట్టి తీశారని విమర్శించారు. ఆ తర్వాత దర్శకుడు సుజీత్ ఎక్కడ కూడా కనిపించింది లేదు. దీనితో ఈ కుర్ర దర్శకుడి తర్వాత సినిమా ఏంటి అన్నది పెద్ద చర్చనీయాంశంగా మారింది.

తాజా సమాచారం ప్రకారం తనకి మొదటి సినిమా అవకాశాన్ని ఇచ్చిన హీరో శర్వానంద్ తోనే తన తదుపరి చిత్రాన్ని చేయాలనీ అనుకుంటున్నాడట సుజీత్.. ఈ సినిమాని కూడా యువీ క్రియేషన్స్ వారే నిర్మించబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే కథ చర్చలు కూడా అయిపోయాయని సమాచారం. దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories