ప్రేక్షకులు చాలా మారిపోయారు.. కొత్త కథతో వస్తా

ప్రేక్షకులు చాలా మారిపోయారు.. కొత్త కథతో వస్తా
x
Highlights

నీకోసం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు శ్రీనువైట్ల..

నీకోసం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు శ్రీనువైట్ల.. ఆ తర్వాత సొంతం, ఆనందం, అందరివాడు, కింగ్, దూకుడు లాంటి సినిమాలను చేసి కామెడీ స్పెషలిస్ట్ గా పేరు సంపాదించుకున్నాడు. ఈ సినిమాలతో వచ్చిన విజయాలతో ఏకంగా టాప్ డైరెక్టర్లలో ఒకడిగా నిలిచాడు శ్రీనువైట్ల..

కానీ ఈ మధ్య శ్రీనువైట్లకి మాత్రం సరైనా హిట్టు పడడం లేదు. ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ.. ఇలా వరుసగా ఫ్లాప్‌లు ఆయనని పలకరించాయి. దీనితో శ్రీను వైట్లతో సినిమా అంటేనే హీరోలు డేట్స్ ఇవ్వడం మానేశారు. ఈ సంవత్సరం ఒక్క సినిమాని కూడా రిలీజ్ చేయలేదు శ్రీను వైట్ల.. అయితే తాజగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీను వైట్ల తన తదుపరి చిత్రాల గురించి వెల్లడించాడు.

"ప్రేక్షకులు చాలా మారిపోయారు. మంచి కథలనే డిమాండ్ చేస్తున్నారు. గతంలో చాలా సినిమాల విషయంలో ఐడియాలను ఆలోచించాను కానీ అవి వర్కవుట్ అవుతాయా ? లేదా? అని ఆలోచించలేదు. ఇకపై అలాంటి తప్పులు చేయకూడదనుకున్నాను. కావాలనే బ్రేక్ తీసుకున్నా. అందుకే ఎవరికీ కనిపించలేదు. ఈ గ్యాప్‌లో మంచి కథను ఫైనలైజ్ చేశా. వచ్చే ఏడాది సినిమా ఎనౌన్స్‌మెంట్ ఉంటుందని శ్రీనువైట్ల చెప్పుకొచ్చాడు.

అయితే శ్రీనువైట్ల తదుపరి చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఉంటుందని తెలుస్తోంది. రాక్షసుడు సినిమాతో మంచి హిట్టు కొట్టిన బెల్లంకొండ ఇప్పుడు కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత శ్రీను వైట్లతో సినిమా ఉంటుందని సమాచారం. కానీ దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories