ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీ‌నివాస‌రావుకు కరోనా పాజిటివ్

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీ‌నివాస‌రావుకు కరోనా పాజిటివ్
x
Highlights

కరోనా వైరస్ ఎవ్వరినీ వదలట్లేదు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు...

కరోనా వైరస్ ఎవ్వరినీ వదలట్లేదు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు కరోనా సోకగా.. తాజాగా ప్రముఖ సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస‌రావు కరోనా బారినపడ్డారు. ఈ విష‌యాన్ని ఫేస్ బుక్ వీడియో ద్వారా స్వ‌యంగా వెల్ల‌డించారు సింగీతం. సెప్టెంబ‌ర్ 9న కోవిడ్ పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు వెల్ల‌డించిన ఆయన, ఈ నెల 22న హోమ్ ఐసొలేష‌న్ పూర్త‌వుతుంద‌ని వెల్లడించారు.

లక్షణాలు కొద్దిగా ఉండడంతో ఇటీవ‌ల క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నాన‌ని, త‌న‌కి పాజిటీవ్ అని తేలింద‌ని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఇప్పుడేంటి.. గ‌త అర‌వై, డ‌భై ఏళ్లుగా పాజిటీవ్‌నే అంటూ క‌రోనాని సైతం లైట్ తీసుకున్నారు దర్శకుడు. పరీక్షల్లో పాజిటీవ్ అని తేలడంతో ఆయన ప్రస్తుతం హోం ఐసొలేష‌న్‌లో ఉన్నాన‌ని పేర్కోన్నాడు. ఈ హోమ్ ఐసోలేషన్ ఈనెల 23 వ‌ర‌కూ ఉండనుందని చెప్పారు. ఈ సందర్భంగా తన అభిమానులు, స‌న్నిహితులు, స్నేహితులు కంగారు ప‌డొద్ద‌ంటూ త‌న ఆరోగ్యం పూర్తిగా అదుపులోనే ఉంద‌ని, త్వ‌ర‌లోనే పూర్తిగా కోలుకుంటానని అన్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories