ఈ సినిమాలో కేవలం రష్మికా మందన్న మాత్రమే హీరోయినట

ఈ సినిమాలో కేవలం రష్మికా మందన్న మాత్రమే హీరోయినట
x
Highlights

'అ ఆ' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నితిన్ తన ఇమేజ్ ను కాపాడుకోలేకపోయాడు. వరుసగా మూడు డిజాస్టర్ లను అందుకున్న ఈ యువ హీరో ప్రస్తుతం తన ఆశలన్నీ తన...

'అ ఆ' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నితిన్ తన ఇమేజ్ ను కాపాడుకోలేకపోయాడు. వరుసగా మూడు డిజాస్టర్ లను అందుకున్న ఈ యువ హీరో ప్రస్తుతం తన ఆశలన్నీ తన తదుపరి సినిమా అయిన 'భీష్మ' పైనే పెట్టుకున్నాడు. 'ఛలో' సినిమాతో హిట్ అందుకున్న వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రష్మికా మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాలో 'చిత్రలహరి' బ్యూటీ కల్యాణీ ప్రియదర్శన్ రెండవ హీరోయిన్ పాత్రలో కనిపించబోతోంది అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజాగా ఈ విషయమై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు వెంకీ కుడుముల. 'నితిన్ హీరోగా నటిస్తున్న 'భీష్మ' సినిమాలో హీరోయిన్ కేవలం రష్మిక మందన్న మాత్రమే. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలో విడుదల చేస్తాం" అని సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు వెంకీ కుడుముల. అంతేకాక కళ్యాణి ప్రియదర్శన్ కూడా తన తదుపరి సినిమా గురించి తానే అధికారికంగా చెబుతానని పోస్ట్ చేసింది. రొమాంటిక్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'భీష్మ' సినిమాతో నితిన్ కచ్చితంగా హిట్ అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories