మాహిష్మతీ సామ్రాజ్యంలో మాస్కులు తప్పనిసరి ; జక్కన్న

మాహిష్మతీ సామ్రాజ్యంలో మాస్కులు తప్పనిసరి ; జక్కన్న
x
Highlights

టాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్ ఎస్‌.ఎస్‌.రాజమౌళీ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని అవగాహన కల్పించే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే ఓ వీడియోని చేశాడు.

must much: లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా వైరస్ ని అడ్డుకోవడం చాలా కష్టతరంగా మారిపోతుంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజుకు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో 11,489, తెలంగాణలో 11,364 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కరోనాకి స్వీయ నియంత్రణ తప్పనిసరి అని, అదే కరోనా నుంచి మనల్ని కాపాడుతుందని వైద్యులు, శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.. ఇక సమాజీక దూరం తప్పనిసరి అని మాస్క్ కూడా తప్పనిసరి అని అన్ని రాష్ట్రాలు హెచ్చరిస్తున్నాయి. మాస్క్ ధరించకపోతే కొన్ని చోట్లల్లో జరిమానా కూడా విధిస్తున్నారు.

ఈ నేపధ్యంలో టాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్ ఎస్‌.ఎస్‌.రాజమౌళీ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని అవగాహన కల్పించే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే ఓ వీడియోని చేశాడు. బాహుబలి సినిమాలో ప్రభాస్‌, రానా తలపడే ఓ సన్నివేశంలో ప్రభాస్, రానాలకి మాస్క్ ధరించి చూపిస్తూ మాహిష్మతీ రాజ్యంలో కూడా మాస్కులు తప్పనిసరి అంటూ యునైటెడ్‌ సాఫ్ట్‌ వీఎఫ్‌ఎక్స్‌ సూడియో టీమ్‌ ఎడిట్‌ చేసిన వీడియోని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. రాజమౌళి చేసిన ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR అనే సినిమా తెరకెక్కుతుంది. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటిచింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories