Radha Krishna Kumar: అదే "రాధేశ్యామ్" ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది అంటున్న డైరెక్టర్

Director Radha Krishna Kumar Talks About Radhe Shyam Movie | Telugu Movie News
x

అదే "రాధేశ్యామ్" ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది అంటున్న డైరెక్టర్

Highlights

Radha Krishna Kumar: అదే "రాధేశ్యామ్" ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది అంటున్న డైరెక్టర్

Radha Krishna Kumar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "రాధేశ్యామ్". "జిల్" ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఎప్పుడో సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక తాజాగా సినిమాని మార్చ్ 11 న థియేటర్ లలో విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు. టి సిరీస్ మరియు యు.వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా లో కృష్ణంరాజు, భాగ్య శ్రీ, సచిన్ ఖెడేకర్, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఫాంటసీ ప్రేమకథగా పీరియడ్ బ్యాక్ డ్రాప్తో సాగే ఈ సినిమాలో ప్రభాస్ ఒక హస్తసాముద్రికుడి పాత్రలో కనిపించనున్నారు. వరుసగా చార్ట్ బస్టర్ లను అందిస్తున్న ఎస్.ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. "అఖండ", "భీమ్లా నాయక్" వంటి సినిమాలలో తన నేపథ్య సంగీతంతో ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేసిన ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాలో కూడా అదిరిపోయే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినట్లు డైరెక్టర్ రాధాకృష్ణ చెబుతున్నారు. ఎస్.ఎస్ తమన్ అందించిన సంగీతం రాధేశ్యామ్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి ఎలివేట్ చేసిందని తమన్ పై ప్రశంసల వర్షం కురిపించారు రాధాకృష్ణ.

Show Full Article
Print Article
Next Story
More Stories