చంద్రముఖి సీక్వెల్‌ రాబోతుంది

చంద్రముఖి సీక్వెల్‌ రాబోతుంది
x
Highlights

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా ఎంత పెద్ద హిట్టయిందో పెద్దగా చెప్పాల్సిన పని లేదు.. హర్రర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకి...

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా ఎంత పెద్ద హిట్టయిందో పెద్దగా చెప్పాల్సిన పని లేదు.. హర్రర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మారధం పట్టారు. పీ వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2005 లో విడుదలైంది. తమిళ్ , తెలుగు అని తేడా లేకుండా అన్ని చోట్ల బాగా ఆడింది ఈ సినిమా.. ఇక తమిళనాడులోని శాంతి థియేటర్‌లో 890 రోజులపాటు ఆడి రికార్డును నెలకోల్పింది. ఈ సినిమాని ఇప్పటికి టీవీలో వచ్చిన ప్రేక్షకులు చూస్తురంటే అర్ధం చేసుకోవచ్చు

అయితే ఈ సినిమాకి సీక్వెల్ వస్తే బాగుండు అని అనుకోని ప్రేక్షకుడు బహుశా ఉండడెమో! దానికి తగ్గట్టు గానే ఈ సినిమాకి సీక్వెల్ తీయబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి. కానీ అవి కేవలం వార్తలకి మాత్రమే పరిమితం అయ్యాయి. అయితే ఇప్పుడు సీక్వెల్‌ తీస్తున్నానని దర్శకుడు పీ వాసు ప్రకటించాడు. దీనికి సంబంధించిన స్ర్కిప్ట్‌ దాదాపుగా సిద్ధమైనట్టేనని, ప్రముఖ నిర్మాణ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమాలో రజినీకాంత్ నటిస్తాడా లేకా మరెవరైనా నటిస్తారా అన్నది చూడాలి మరి.

ఇక చంద్రముఖి సినిమా కథ విషయానికి వస్తే వెంకటపతి అనే ఒక రాజుకి తను కోరుకున్నది దక్కి తీరాల్సిందే అనే స్వభావం కలవాడు. ఈ నేపధ్యంలో తన రాజ్యంలో నాట్యం చేసేందుకు వచ్చిన చంద్రముఖిని తన ప్రియుడు గుణశేఖర్ ని చంపేస్తాడు ఆ వెంకటపతి రాజు. దీనితో ఆ వెంకటపతి రాజుపై పగ పెంచుకున్న చంద్రముఖి అతన్ని ఎలాగైనా అంతం చేయాలనీ ఓ ఆత్మ రూపంలో ఆ ఇంట్లోనే ఉంటుంది. మరి ఆమె పగ ఎలా తీరింది. అందులో రజినీ పాత్ర అంటి అన్నది ఇతివృత్తం..ఈ సినిమాని హర్రర్, కామెడీతో చాలా బాగా హండిల్ చేశాడు వాసు.

ఇక రజినీకాంత్ ప్రస్తుతం మురగదాస్ దర్శకత్వంలో దర్బార్ అనే సినిమాని చేశాడు. ఈ సినిమాని సంక్రాంతి పండగకి కానుకగా ఈ నెల 9 విడుదల చేయబోతున్నారు. నయనతార, నివేతా థామస్ హీరోయిన్స్ గా నటించారు. అనిరుద్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories