Chianjeevi Movie: 'వేదాళం' రీమేక్, మెహర్ రమేశ్ దర్శకత్వంలో మెగాస్టార్?

Chianjeevi Movie: వేదాళం రీమేక్, మెహర్ రమేశ్ దర్శకత్వంలో మెగాస్టార్?
x
mehar ramesh chiranjeevi(File Photo)
Highlights

Meher Ramesh To Direct Megastar : సైరా చిత్రం అనంతరం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే.

Meher Ramesh to Direct Megastar: సైరా చిత్రం అనంతరం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇది చిరంజీవికి 152వ చిత్రం కావడం విశేషం.. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్ కథానాయకగా నటిస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం వలన సినిమా వాయిదా పడింది.

అయితే ఈ లాక్‌డౌన్ సమయంలో ఆచార్య తరవాత చేయబోయే చిత్రాలకి సంబంధించిన కథలను వింటున్నట్టుగా చిరంజీవి తన తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్న సంగతి తెలిసిందే.. . ఈ చిత్రం తర్వాత 'లూసీఫర్' రీమేక్ లో నటిస్తున్నట్టుగా చిరంజీవి వెల్లడించారు. అయితే ఈ సినిమాని ప్రస్తుతం చిరు పక్కన పెట్టినట్టుగా ఫిలిం నగర్ లో న్యూస్ చక్కర్లు కొడుతుంది. దీంతో చిరంజీవి తదుపరి ఏం చిత్రాలు చేయబోతున్నారనే చర్చలు జరుగుతున్నాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం చిరంజీవి ఆచార్య తరవాత మెహర్ రమేశ్ దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. తమిళంలో అజీత్ హీరోగా వచ్చిన 'వేదాళం' చిరు చిత్రాన్ని రీమేక్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కానీ దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక ముందుగా వేదాళం చిత్రాన్ని పవన్ కల్యాణ్ రీమేక్ చేయాలనుకున్నారు.

మెహర్ రమేశ్ ప్రభాస్ హీరోగా వచ్చిన బిల్లా సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత శక్తి, షాడో లాంటి చిత్రాలను తెరకెక్కించి భారీ డిజాస్టర్ లను సంపాదించుకున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories