బాలకృష్ణ , మోక్షజ్ఞతో మల్టీస్టారర్ సినిమా చేస్తా : అనిల్ రావిపూడి

బాలకృష్ణ , మోక్షజ్ఞతో మల్టీస్టారర్ సినిమా చేస్తా : అనిల్ రావిపూడి
x
Anil Ravipudi Balakrishna Mokshagna
Highlights

రాజమౌళి, కొరటాల శివ తర్వాత అపజయం ఎరుగని దర్శకుడిగా అనిల్ రావిపూడి కొనసాగుతున్నాడు.

రాజమౌళి, కొరటాల శివ తర్వాత అపజయం ఎరుగని దర్శకుడిగా అనిల్ రావిపూడి కొనసాగుతున్నాడు. చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ స్టార్ డైరెక్టర్ స్థానానికి చేరుకున్నాడు.. పటాస్ తో మొదలైన ఆయన ప్రయాణం సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 సినిమాలతో వరుస సక్సెస్ లను అందుకున్నాడు.. వచ్చిన ఈ సక్సెస్ లే అనిల్ రావిపూడి కి సూపర్ స్టార్ మహేష్ బాబు ని డైరెక్ట్ చేసే చాన్స్ నీ ఇచ్చింది... ఇక మహేష్ బాబు తో తాజాగా 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమాను తెరకెక్కించి మహేష్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా నిలిపాడు..

అయితే తాజాగా నీకు మాత్రమే చెప్తా అనే షోలో పాల్గొన్న అనిల్ రావిపూడి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.. అందులో భాగంగా హీరో "బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను ఎప్పటికైనా నా డైరెక్ట్ చేస్తానని అనిల్ రావిపూడి వెల్లడించాడు.. కుదిరితే బాలకృష్ణతో కూడా సినిమా చేసేందుకు సిద్ధమేనని పేర్కొన్నాడు.. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న సమయంలో బాలకృష్ణ ,మోక్షజ్ఞతో కలిసి ఉన్న ఫోటో నా గదిలో ఉండేది. ఒకవేళ నేను డైరెక్టర్ అయితే వీరిద్దరి తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తానని చెప్పేవాడిననీ " అని అనిల్ రావిపూడి వెల్లడించాడు..

ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నా అనిల్ ఎఫ్ 2 కి సీక్వెల్ చేసే పనిలో ఉన్నట్టు గా తెలుస్తోంది. ఇక ఇందులో హీరోలుగా ఎఫ్ 2లో నటించిన వెంకటేశ్ వరుణ్ తేజ్ లే నటించనున్నారు. వీరికి తోడుగా మరో హీరో జత కానున్నాడు.. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories