సినిమాల్లోకి దిల్ రాజు సతీమణి?

సినిమాల్లోకి దిల్ రాజు సతీమణి?
x
Highlights

అయితే తాజాగా టాలీవుడ్‌ టాప్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు సైతం ఓటీటీ వైపు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. అయన సతీమణి తేజస్వీని ఓటీటీ కోసం స్వయంగా ఓ కథను సిద్ధం చేశారని తెలుస్తోంది.

కరోనా వైరస్‌ వలన నష్టపోయిన రంగాలలో సినిమా ఇండస్ట్రీ కూడా ఒకటి.. ధియెటర్లు మూతపడడం, షూటింగ్ లు ఆగిపోవడంతో సినీ ఇండస్ట్రీ అయితే కొన్ని వేల కోట్ల రూపాయలను నష్టపోయింది. అయితే తొమ్మిది నెలల విరామం అనంతరం ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకుంటున్నప్పటికి ప్రేక్షకుడు మాత్రం ఆ వైపుకు కన్నెత్తికూడా చూడటంలేదు. ఈ క్రమంలో భవిష్యత్‌లో నిర్మించబోయే సినిమాలను ఓటీటీని వేదికగా చేసుకుని రిలీజ్ చేసే ఆలోచనలో పడ్డారు దర్శకనిర్మాతలు. దీనికి అనుగుణంగానే కథలను సిద్ధం చేసుకుంటున్నారు.

అయితే తాజాగా టాలీవుడ్‌ టాప్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు సైతం ఓటీటీ వైపు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. అయన సతీమణి తేజస్వీని ఓటీటీ కోసం స్వయంగా ఓ కథను సిద్ధం చేశారని తెలుస్తోంది.లాక్‌డౌన్‌ టైములో ఇంటికే పరిమితమైన ఆమె సినిమా కథలపై దృష్టిసారించారట. అందులో భాగంగానే తన భార్య చెప్పిన ఓ స్టోరీకి ఫిదా అయ్యారట దిల్‌రాజు. ప్రస్తుతం ఆ కథకి మెరుగులు దిద్దే పనిలో పడ్డారట దిల్ రాజు రైటింగ్ టీం.

దిల్ రాజు ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటుగా వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న ఎఫ్3 సినిమా పైన కూడా బిజీగా ఉన్నారు. కాగా అటు దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో మరణించారు. ఆ తర్వాత దిల్ రాజు హైదరాబాద్‌కు చెందిన తేజస్విని (వైఘా రెడ్డి)ని ఈ ఏడాది మార్చిలో వివాహం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories