సిరివెన్నెల మనసు మార్చిన దేవి శ్రీ పాట

సిరివెన్నెల మనసు మార్చిన దేవి శ్రీ పాట
x
Highlights

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవీ శ్రీ ప్రసాద్ పేరు ముందే ఉంటుంది. టాలీవుడ్ లో రాక్ స్టార్ గా పిలుచుకునే దేవి శ్రీ కి ప్రశంసలు అందుకోవడం...

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవీ శ్రీ ప్రసాద్ పేరు ముందే ఉంటుంది. టాలీవుడ్ లో రాక్ స్టార్ గా పిలుచుకునే దేవి శ్రీ కి ప్రశంసలు అందుకోవడం కొత్త కాదు. కానీ సాహిత్యానికి మరోపేరైన సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నుండి దేవి ప్రశంసలు అందుకోవడం విశేషం. 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలో 'సూపర్ మచ్చి' పాట సాహిత్యానికి సిరివెన్నెల ఫిదా అయిపోయి దేవీపై ప్రశంసల వర్షం కురిపించారట. ఆ పాట విన్నాక "నాన్నా, నేను మాస్ పాటలు ఐటమ్ సాంగ్స్ రాయకూడదని అనుకున్నాను. కానీ నీ పాట విన్నాక మళ్ళీ మాస్ పాటలు రాయాలని ఉంది" అన్నారట.

ఈ పాటలో 'సండే సంత కాడ మండే ఎండలోన' అనే లైన్ లో ప్రాస సిరివెన్నెలకు బాగా నచ్చిందట. దీనిపై ఒక వ్యాసం కూడా రాసి ఇస్తానని చెప్పారని దేవీశ్రీ సంతోషంగా వెల్లడించాడు. సిరివెన్నెల గారి ప్రశంసలు తాను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పుకొచ్చాడు రాక్ స్టార్. అయితే నిజానికి ఈ పాటను దేవీ రాయలనుకోలేదట. ట్యూన్ కట్టే సమయంలో పల్లవి వరకూ రాసుకున్నాక దర్శకుడు త్రివిక్రమ్ కు వినిపిస్తే ఆయనకు బాగా నచ్చేసి పాట ఓకే చేసేసారట. మొత్తం పాట రాయమని పట్టుబట్టి రాయించారట. ఆ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories