Bheeshma: 'భీష్మ' సినిమాపై మానవ హక్కుల కమీషన్‌కు ఫిర్యాదు

Bheeshma: భీష్మ సినిమాపై మానవ హక్కుల కమీషన్‌కు ఫిర్యాదు
x
complaint on Bheeshma movie
Highlights

యంగ్ హీరో నితిన్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా, వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'భీష్మ'... మహాశివరాత్రి కానుకగా ప్రేక్షకుల

యంగ్ హీరో నితిన్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా, వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'భీష్మ'... మహాశివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి ఆట నుంచే మంచి టాక్ ని సంపాదించుకొని దూసుకుపోతుంది.. శ్రీనివాస కళ్యాణం లాంటి ప్లాప్ తరవాత చాలా గ్యాప్ తీసుకొని సినిమాని చేసిన నితిన్ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.

విడుదలకు ముందే పాటలు, ట్రైలర్‌కు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ చిత్రంపై అంచాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే సినిమా విడుదలై విజయం సాధించింది. సినిమా విడుదలై 20 రోజులు అయ్యాక ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని, అలాంటి సన్నివేశాలను వెంటనే తొలగించాలని గంగపుత్ర సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్ మానవ హక్కుల కమీషన్‌కు ఫిర్యాదు చేశారు.. మరి దీనిపైన చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి...

ఇక ఈ సినిమా తర్వాత నితిన్ విభిన్నమైన కథలను తెరకెక్కించే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమాని, తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చిత్రంలో నటిస్తున్నాడు. రంగ్ దే చిత్రంలో నితిన్ కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు పిక్స్ అయ్యాడు నితిన్.. ఈ సినిమాలు ఈ సంవత్సరంలోనే విడుదల చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories