Chiranjeevi: బయోపిక్ కి నో చెప్పిన చిరంజీవి

Chiranjeevi Says no to Biopic Movie | Tollywood News
x

Chiranjeevi: బయోపిక్ కి నో చెప్పిన చిరంజీవి

Highlights

Chiranjeevi: చిరంజీవి వదులుకున్న బయోపిక్ ను చేస్తున్న రవితేజ

Chiranjeevi: ఈ మధ్యకాలంలో బయోపిక్ ల హవా బాగానే నడుస్తోంది. స్టార్ హీరోల నుంచి డైరెక్టర్ల వరకు అందరూ బయోపిక్స్ చేయడంపై బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా "సైరా నరసింహారెడ్డి" అనే బయోపిక్ ని తీశారు. అయితే ఆ సినిమా తర్వాత చిరంజీవి కి బయోపిక్ చేసే అవకాశం వచ్చిందట.

గజదొంగ టైగర్ నాగేశ్వరరావు పై రావాల్సిన బయోపిక్ కూడా ముందుగా చిరంజీవి వద్దకే వెళ్లిందట కానీ చిరంజీవి ఆ సినిమాని చేయలేకపోయారట. దీంతో ఈ సినిమా మాస్ మహారాజా రవితేజ చేతిలోకి వెళ్ళింది."దొంగాట" మరియు "కిట్టు ఉన్నాడు జాగ్రత్త" ఫేమ్ వంశీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మధ్యనే ఈ సినిమాని దర్శకనిర్మాతలు గ్రాండ్ గా లాంచ్ కూడా చేశారు.

మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకలో మాట్లాడుతూ దర్శకుడు వంశీ ముందుగా ఈ కథతో చిరంజీవి నే సంప్రదించినట్లు తెలిపారు. కానీ ఇతర సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి ఈ సినిమా చేయలేకపోవడంతో రవితేజ సంప్రదించగా రవితేజ ఒప్పుకున్నట్లు చెప్పారు. అదే వేడుకలో మాట్లాడుతూ చిరంజీవి తాను చేయలేకపోయినా సినిమాని తన తమ్ముడు రవి తేజ చేయటం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories