Chiranjeevi: సంక్రాంతి క్లాష్ పై రియాక్ట్ ఆయన చిరంజీవి

Chiranjeevi React On Sankranthi Clash
x

Chiranjeevi: సంక్రాంతి క్లాష్ పై రియాక్ట్ ఆయన చిరంజీవి

Highlights

*సంక్రాంతి రెండు సినిమాల నిర్మాత ఏమంటున్నారంటే

Chiranjeevi: సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. చాలా వరకు పెద్ద సినిమాలన్నీ సంక్రాంతి బరిలోనే దిగడానికి సిద్ధమవుతాయి. వచ్చే ఏడాది 2023 సంక్రాంతి సందర్భంగా కూడా మెగాస్టార్ చిరంజీవి "వాల్తేరు వీరయ్య" మరియు నందమూరి బాలకృష్ణ "వీర సింహారెడ్డి" సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద క్లాష్ అవ్వడానికి సిద్ధమవుతున్నాయి. ఇద్దరు సీనియర్ హీరోల సినిమాల మధ్య క్లాష్ అంటే అది చిన్న విషయం కాదు.

మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాలను నిర్మించింది మైత్రి మూవీ మేకర్స్ వారే. సినిమాలో నేను నటించిన మాట నిజమే కానీ రిలీజ్ డేట్ విషయంలో మాత్రం నిర్మాతలే ఆఖరి నిర్ణయం తీసుకుంటారు.

"మా రెండు సినిమాలని నిర్మించింది ఒకరే. ఈ రెండు సినిమాలు వారికి రెండు కళ్ళు లాంటివి. అందులో ఎవరిని తక్కువ చేయాలని చూడరు. రెండు సినిమాలకి ఒకే న్యాయం జరగాలని వాళ్లు ప్రయత్నిస్తున్నారు. విడుదలయ్యాక కూడా మీరు సర్ప్రైజ్ అవుతారు," అని చిరంజీవి చాలా పాజిటివ్ గారి రీయాక్ట్ అయ్యారు. కానీ మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ నుంచి రవిశంకర్ కూడా చిరంజీవి రెండు సినిమాల క్లాష్ విషయంలో ఎంకరేజ్ చేసినట్లు చెప్పుకొచ్చారు.

"చిరంజీవి గారు ఎప్పుడు ఈ రెండు సినిమాలు బాగా ఆడాలని చెప్పేవాళ్ళు. ఆయన చాలా పాజిటివ్ గా ఉంటారు. రెండు సినిమాల్ని ఒకేరోజు విడుదల చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. థియేటర్ల విషయంలో కానీ ప్రమోషన్ల విషయంలో కానీ రెండిటికీ సమన్యాయం ఉంటుంది," అని అన్నారు రవిశంకర్. ఇక రెండు సినిమాలనీ నిర్మించిన నిర్మాతలే సినిమాలపై ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు అభిమానులు కూడా ఎలాంటి సందేహాలు లేకుండా నిశ్చింతగా ఉండొచ్చని చెప్పుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories