కళాతపస్వి విశ్వనాథ్‌ను కలిసిన మెగాస్టార్

కళాతపస్వి విశ్వనాథ్‌ను కలిసిన మెగాస్టార్
x
Highlights

మెగాస్టార్ చిరంజీవి..కళాతపస్వి కె. విశ్వనాథ్ ను గురుతుల్యులుగా భావిస్తారు. దీపావళి సందర్భంగా విశ్వనాథ్ ఆశీస్సుల కోసం చిరంజీవి అయన వద్దకు వెళ్ళారు.

తెలుగు సినిమా స్థాయిని శిఖరాగ్రానికి చేర్చి, తన ప్రతి సినిమాతో జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న దర్శకులు విశ్వనాథ్ ను మెగాస్టార్ చిరంజీవి కలిశారు. తనని క్లాస్ అండ్ క్లాసికల్ హీరోగా నిలబెట్టిన దర్శకనాధుడు విశ్వనాథ్‌ను దీపావళి సందర్భంగా సతీసమేతంగా కలిశారు మెగాస్టార్ చిరంజీవి. కాసేపు ఇద్దరు తమ మధుర జ్ఞాపకాలను, అప్పటి సినిమా విశేషాలను గుర్తుచేసుకున్నారు. విశ్వనాథ్ గారి ఆరోగ్య క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

మెగాస్టార్ కాశీ విశ్వనాథ్ గారి ఆరోగ్య క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇది ఇటు చిరు అభిమానుల్లోనూ, విశ్వనాధ్ గారి అభిమానుల్లోనూ దీపావళీ సంతోషాన్ని నింపింది. దర్శకులు శ్రీ కాశీ విశ్వనాథ్ గారి సినిమాలకు ప్రపంచ సినిమా స్థాయి ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. విశ్వ‌నాథ్ గారిని క‌ల‌వాల‌నిపించి ఈరోజు ఆయ‌న ఇంటికి రావ‌డం జ‌రిగింది. ఆయ‌న నాకు ఎన్నో అవార్డులు తెచ్చి పెట్టిన చిత్రాలు తీశారు. ఈ దీపావ‌ళి సంద‌ర్భంగా ఆయ‌న్ని క‌ల‌వ‌డం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అంద‌రికీ కూడా దీపావ‌ళి శుభాకాంక్ష‌లు అన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories